కుందేలు కొబ్బరి కాయలు - చిన్నారుల కోసం చిన్న కథ -డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
 ఒక అడవిలో ఒక కుందేలు వుండేది. ఎండలో తిరిగి తిరిగీ దానికి బాగా వేడి చేసింది. దాంతో అది మంచమెక్కింది. అది చూసి పిల్లకుందేలు బాధపడతా వుంటే కోడిపుంజు చూసి "చూడల్లుడూ! కొబ్బరినీళ్ళు చానా చలువ. అవి గనుక మూడు పూటలా తాపించినావనుకో దెబ్బకు వేడంతా దిగిపోయి మళ్ళా మునుపటి మాదిరి ఐపోతాది. పో... పోయి ఎవరినన్నా అడిగి కొన్ని కాయలు తీసుకొని రాపో" అని చెప్పింది.
పిల్లకుందేలు కొబ్బరికాయల కోసం పోతా వుంటే దారిలో ఒక మేక కనబడింది. వెంటనే అది "మేక మామా... మేక మామా... మా అమ్మకు వేడి చేసింది. కొబ్బరి నీళ్ళు మూడుపూటలా తాపితే ఒళ్ళు చల్లగయి వేడి తగ్గుతుందట. కొన్ని కాయలు కోసివ్వవా” అని అడిగింది.
దానికా మేక "చూడు పాపా... మీలాగే నేను గూడా కొబ్బరిచెట్టు ఎక్కలేను. పోయి కోతిమామ ఎక్కడున్నాడో వెదికి పట్టుకో. అదయితే ఎంత పెద్ద చెట్టయినా సరే... సరసరసర ఎక్కేసి కాయలు తెంపుతాది" అని చెప్పింది.
పిల్లకుందేలు అలాగేనని కోతిని వెదుక్కుంటా బైలుదేరింది. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఆ కోతి ఒక కొబ్బరిచెట్టు మీద హాయిగా కొబ్బరినీళ్ళు తాగుతా కనబడింది. అది చూసిన పిల్లకుందేలు 'కోతిమామా కొన్ని కాయలు కోసివ్వవా. మా అమ్మకు వేడి చేసి మంచం మీద పడిపోయింది' అంది.
కానీ ఆ కోతికి చాలా పొగరు. చిన్ని కుందేలు మాటలను కొంచం గూడా పట్టించుకోకుండా "ఫో.. ఫో... నీకు కాయలు తెంపివ్వడం కన్నా నాకింకేం పని లేదనుకుంటున్నావా. ఇంకా ఇక్కడ ఒక్క నిమిషం నిలబడ్డావనుకో ఒక కాయ తెంపి నెత్తి మీదికి విసురుతా చూడు. దెబ్బకు తల పగిలిపోతాది" అంటూ భయపడించింది.
కోతి అలా అనేసరికి పాపం... కుందేలు పిల్లకి ఏడుపొచ్చింది. కళ్ళనిండా నీళ్ళు కారిపోతా వుంటే బాధతో ఇంటికి పోసాగింది. అంతలో దానికి ఒక ఏనుగు ఎదురొచ్చింది. "ఏం పాపా... అలా కళ్ళనీళ్ళు పెట్టుకోని పోతా వున్నావు. ఏమయింది” అని అడిగింది. కుందేలు పిల్ల జరిగిందంతా చెప్పింది.
అది విన్న ఏనుగు "అరెరే... కోతి అలా అనిందా. ఐనా ఆపదలు వచ్చినపుడు ఒకరికొకరు సాయం చేసుకోకుంటే ఎలా . దా నావెంబడి" అంటూ కుందేలు పిల్లను మీద ఎక్కించుకోని కొబ్బరిచెట్టు దగ్గరికి పోయింది.
కొబ్బరి చెట్టు మీద కోతి హాయిగా కొబ్బరినీళ్ళు తాగుతా వుంది. ఏనుగు తొండంతో కొబ్బరి చెట్టును బలంగా పట్టుకొని వేగంగా అటూ యిటూ వూపసాగింది. పైన వున్న కోతి అదిరిపడింది. "ఏయ్... ఏనుగు మామా... ఎందుకలా వూపుతా వున్నావు. కిందపడేలా వున్నా. ఆపాపు” అంటూ గట్టిగా కంగారుగా అరిచింది.
పక్కవాళ్ళ గురించి కొంచం గూడా పట్టించుకోని నీలాంటి వాళ్ళతో నాకు అనవసరం. నీవు కిందపడి... కాలిరిగితే నాకేమి, చెయ్యిరిగితే నాకేమి. మాకు కొబ్బరికాయలు కావాలి అంతే..." అంటూ మరింత గట్టిగా సరసరసర ఊపసాగింది. కోతికి గిర్రున కళ్ళు తిరగసాగాయి. భయంతో కొబ్బరి మట్టను గట్టిగా పట్టుకోని "ఏనుగు మామా... బుద్ది పొరపాటయి అలా అన్నా. ఈ ఒక్కసారికి మన్నించు. ఇంకెప్పుడూ ఎవరినీ అలా బాధపెట్టను. అందరితోనూ కలసిమెలసి మంచిగా వుంటా" అంది వణికిపోతూ. ఏనుగు కొబ్బరిచెట్టును ఊపడం ఆపింది. కోతి బెరబెరా మంచి మంచి నీళ్ళ కాయలు తెంపుకోని కిందికి దిగి వచ్చింది. ఏనుగు అవన్నీ తీసుకోని కుందేలు పిల్లకు ఇచ్చింది. అది సంబరంగా ఏనుగుమామకు , కోతిమామకు ముద్దుపెట్టి కాయలు తీసుకొని ఉరుక్కుంటా ఇంటికి పోయింది.
**********

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం