విలువైన నిజాయితీ.;- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్ .9884429899
 అటవిశాఖా విశ్రాంత అధికారి రంగనాథం ఇంటి అరుగుపై కథ వినడానికి చేరిన పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టి 'బాలలు ఈరోజు నిజాయితీ అనేది మనిపికి ఎంతో అవసరం. నిజమైన ఆయనంలో లేక అసలైన మార్గంలో నడుచుకోవడాన్ని నిజాయితీ అంటారు. 
నిజాయితీ అనేది నైతిక పాత్ర యొక్క ఒక విభాగాన్ని సూచిస్తుంది మరియు చిత్తశుద్ధి, యదార్ధం వంటి అనుకూల మరియు సద్గుణ గుణాలనే అర్థాన్ని ఇస్తుంది, అలాగే దురుసుతనం, అబద్ధం, మోసం, దొంగతనం వంటి దుర్గుణాలు లేకపోవడాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా నిజాయితీ అంటే విశ్వసనీయత, విధేయత, నిష్పక్షపాతం, హృదయపూర్వకతనం కలిగి ఉండాలి. నిజాయితి అనేది అనేక జాతి మరియు మతపరమైన సంస్కృతులలో విలువైనదిగా ఉంది. తెలిసో తెలియకో ఏదైనా తప్పు చేసిన వ్యక్తి తన తప్పును తాను గ్రహించి సరిదిద్దుకొనే ప్రయత్నాన్ని నిజాయితీగా తన తప్పును తాను సరిదిద్దుకొంటున్నాడంటారు. నిజాయితీగా వ్యవహరించే వ్యక్తిని "నిజాయితీపరుడు" అంటారు.
నిజాయితీ కల వ్యక్తులు ధర్మబద్ధంగా జీవననాన్ని కొనసాగిస్తూ ఉంటారు. తమ ఆకాంక్షలు, అభిప్రాయాలు, ఆలోచనలను సూటిగా, నిష్కల్మషంగాను వ్యక్తం చేస్తూ తదనుగుణంగా నిబద్ధత తో ప్రవర్తిస్తారు.అటువంటి నిజాయితీ విలువ తెలిపే కథ చెపుతాను...
గుంటూరు నగరంలోని వ్యాపారి రాఘవయ్యకు తనవ్యాపార విషయాలు చూసుకునేందుకు నమ్మకమై ఉద్యోగి అవసరం అయ్యాడు. ఆ ఉద్యోగం కొరకు వచ్చినవారందరిని పరిక్షింపగా,చివరికి శివయ,శంకరయ్య అనే ఇద్దరు యువకులు మిగిలారు.ఆ ఇద్దరు యువకులకు మట్టినింపిన కుండీలు చెరి ఒకటి ఇచ్చి'నాయనలారా ఇవిగో కాకర గింజలు వీటిని చెరొకటి తీసుకొండి, ఈమట్టి కుండీలోనాటి ప్రతిదినం నీరు పోస్తూ గమనించండి. నేడు పౌర్ణమి వచ్చే పౌర్ణమినాటికి మొలక్కెత్తిన మోక్క తీసుకునిరండి' అన్నాడు రాఘవయ్య.
మరలా పౌర్ణమినాటికి ఇరువురి యువకులు రాఘవయ్యగారిని చూడటానికి వచ్చారు.శివయ్య తెచ్చిన పాత్రలొ చిక్కుడు గింజ మెలకెత్తలేదు.శంకరయ్య తెచ్చిన పాత్రలొ చిక్కుడుగింజ మొలకెత్తి ఉంది."శివయ్య నీకు ఇచ్చిన మట్టి పాత్రలొని చిక్కుడు గింజ సరిగ్గా గమనించలేక పోయావు అందుకే అది మొలకెత్తలేదు''అన్నాడు రాఘవయ్యగారు.
''అయ్యా నేను ప్రతిదినం నీరు పోస్తూనేఉన్నా,పైగా గాలి,వెలుతురు తగిలేలా ఉంచి బాగా గమనించాను.నా తప్పు ఏమిలేదు,బహుసా మీరు నాకు ఇచ్చిన కాకర గింజలో ఏదైనా లోపంఉండవచ్చు''అన్నాడు శివయ్య.
పక్కున నవ్విన రాఘవయ్యగారు ''నాయన లారా మీ ఇద్దరికి ఇచ్చిన కాకరగింజలను కావాలని, వేయించి(వేడిచేసి) నవి,మీకు ఇచ్చాను,అవి మెలకెత్తవు.ఆవిషయంనీవు కొంత గ్రహించగలిగావు,
శంకరయ్య కాకరగింజ మొలకెత్తుతుందేమో అని, కొద్దిరోజులు చూసి వేరే కాకరగింజ నాటి మెలకెత్తించాడు. నువ్వుమాత్రంనిజాయితీగా ఎటువంటి మార్పులు చేయకుండా పాత్రను తీసుకువచ్చావు.నీ నిజాయితీ మెచ్చదగినిది. శంకరయ్యా నిజంచెప్పు నువ్వు కాకరగింజను మార్చావు కదూ 'అన్నాడు రాఘవయ్య.
అవును అన్నట్లు తలఊపుతూ తనతప్పు అంగీకరించి వెళ్లిపోయాడు శంకరయ్య.
'శివయ్య నీనిజాయితి మెచ్చదగినది, నీలాంటి యువకులే దేశానికి వెన్నుముక. నేడే ఉద్యోగంలొ చేరు,ఇవిగో తాళాలు నేటినుండి నావ్యాపార లావాదేవీలు అన్ని నీవే నిర్వహించాలి'అన్నాడు రాఘవయ్య.వినయంగా చేతులుజోడించాడు శివయ్య.
బాలలు నిజాయితీ ఎంతగొప్పదో ఈకథద్వారా తెలుసుకున్నారుకదా! మీజీవితంలో ఎన్నడు తప్పుడుమాటలకు,తప్పుడు చేస్టలకు స్ధానంకలిగించకండి' అన్నాడుతాతయ్య.
బుద్దిగా తలఊపారు అరుగుపై ఉన్న పిల్లలంతా.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం