పరీక్ష;- డా.భోజన్నగారి అనసూయ. నిజామాబాద్.99898 22494.

 ప్రశ్న పత్రంలో తప్పులుంటే
అది తాయచేసిన వారికి,                   
పేపర్  తెలిసిపోతే పై అధికారికి,
హాల్లో కాపీ జరిగితే,మాట్లాడితే.....
నీళ్లు,ఆకళ్ళు,మూర్చలు,బాత్రూంలు
ఇవన్నీ దాటకుంటే పర్యవేక్షకుడికి,
ఆ జవాబుపత్రాలు సరిజేసి
అప్పగించేదాకా ఆ కేంద్ర అధికారికి,
పిల్లల మార్కులు తెలిసేదాకా పేరెంట్స్ కి,
పక్కోడికి నాకన్నా ఎక్కువైతయేమో
మార్కులని ఎవడికివాడికి పరీక్షే పరీక్ష.
                               

కామెంట్‌లు