*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0273)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
నందిచే శుక్రాచార్యుని అపహరణ - శివునిచే మింగబడిన శుక్రాచార్యుడు, శివలింగము నుండి బయటకు వచ్చుట - శుక్ర నామము - మృత్యుంజయ జపము - శివాష్టోత్తర శతనామ వర్ణన - శివుడు అంధకునకు వరములు ఇచ్చుట......
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*నారదా! నంది తీసుకువచ్చిన శుక్రాచార్యుని శంభుడు మింగేసున తరువాత రాక్షస సైన్యం పరిస్థితి దయనీయంగా మారింది. వారికి దారి, తెన్నూ తెలియటల్లేదు. వారి సంఖ్యాబలమూ, శక్తి కూడా తగ్గుతున్నాయి. శూరతగవము లేని క్షత్రియ వీరులు లాగా ఉంది దైత్య సమూహం అంతా. దైత్య సైన్యం రణరంగం ను వదలి వేయడానికి సిద్ధం అవుతుండగా, వారిని చూచి అంధక దైత్యరాజు, "యుద్ధంలో వెన్ను చూపి పారిపోయిన వారికి ఉత్తమగతులు లభించవు. యుద్ధ భూమి లో మరణిస్తే పునర్జన్మ ఉండదు. యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది." అని ఉత్సాహ పరిచాడు. రాక్షస సైన్యం ఇనుమడించిన ఉత్సాహంతో దేవగణాల మీదకు మరల దండెత్తారు. దేవ అసుర సేనల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది.*
*అప్పుడు, దేవ గుణములలో మహా బలశాలి అయిన వైశాఖడు, శంకరుని తలచుకుని అంధకుని తో యుద్ధానికి వచ్చాడు. త్రిశూలము, శక్తి, బాణమిలతో అగ్ని వర్షం కురుస్తున్నట్టు దాడి చేసాడు. అంధకుడు కూడా ప్రతిఘటన చేసాడు. కాని, శివుని అనుగ్రహం తో వైశాఖుడు, అంధకుని గ్రుడ్డివానిగా చేసాడు. ఈ పరిణామాన్న శంభుని ఉదరంలో ఉన్న శుక్రాచార్యుడు చూసి కూడా ఏమి చేయలేక, బయట ప్రపంచంలోకి వచ్చే దారి లేక అక్కడే తిరుగుతూ ఉన్నాడు. వృషభవాహనుని ఉదరములో శుక్రాచార్యుని కి సకల లోకములు, త్రిమూర్తులు, సర్వ సృష్టి కనిపిస్తున్నాయి. కానీ, బాహ్య ప్రపంచంలోకి రావడానికి దారి తెలియక నూరు సంవత్సరాలు ఉన్నాడు. కొంతకాలం తర్వాత, భృగుమహర్షి కుమారుడైన శుక్రాచార్యుడు, శివ యోగాన్ని ఆశ్రయించి ఒక మంత్ర జపం చేసాడు. ఆ మంత్ర పఠనం ఫలితంగా, శుక్ర కణ రూపంలో, శంంభుని జఠరం నుండి బయటకు వచ్చాడు.*
*అలా ఈశానుని ఉదరకుహరం నుండి బయటకు వచ్చిన శుక్రాచార్యుడు శివునికి నమస్కారాలు చేసి, కీర్తించాడు. కరుణాసాగరుడు, శంకరుడు, శుక్రాచార్యుని ప్రార్థనలు విని చిరునవ్వుతో అనుగ్రహించారు. పార్వతి ఆతనిని తన కుమారునిగా స్వీకరించింది. విఘ్న రహితునిగా చేసింది, అమ్మ. "ఓయీ! నీవు నా లింగ మార్గమున శుక్ర రూపంలో బయటకు వచ్చావు. కనుక ఇప్పటి నుండి, నీవు "శుక్రడు" అని పిలువ బడతావు. నీవు నా పుత్ర సమానుడవు"అని చేరదీసారు.*
*శంకరునిచే, శుక్రునిగా పిలవబడిన శుక్రుడు, ఆ పరమాత్ముని పాద పద్మములు పట్టి వేయి విధములుగా కీర్తించాడు. "దేవ దేవా! నీ రూపాలు, భుజాలు, పాదములు, శిరములు అన్నీ కూడా అనంతములు. ఇన్ని, అని లెక్కించడం ఎవరి వల్ల కూడా కాదు. నీ ఆకారాలు ఎనిమిది అని చెపుతున్నారు, కానీ, అది సరికాదు. అటువంటి నిన్ను, అల్పుడనైన నేను ఏవిధంగా కీర్తించ గలను. నీకు అనేక నమస్కారాలు." అని అనుగ్రహించాలని ప్రార్ధించాడు. తరువాత, దైత్య సేనలలో చేరాడు, పరమేశ్వర ఆజ్ఞతో.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం