బాల మేధావి; - డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నిలయ విద్వాంసునిగా పని చేయడం  సుకృతం అనే చెప్పుకోవాలి  అక్కడ  మాటలతోనే పని  వారి సత్తాను ప్రదర్శించడం వరకే వారి బాధ్యత  అతి సాత్విక మూర్తి మా ఎన్ సి వి జగన్నాథ చార్యులు గారు  ఒక సందర్భంలో ఆయన రాముడు, ఆనంద్ గారు లక్ష్మణుడు వేషాలు నాటకంలో వేయవలసి వస్తే  రెండు మూడు మాటలు చెప్పిన తర్వాత  నాకూ ఆనంద్ గారికి  పాత్రలను మార్చినట్టుగా అనిపిస్తుంది  సాత్విక మూర్తి  శ్రీరామచంద్రుని వేషంలో  జీవించాలి అంటే అది ఆనంద్ గారికే సాధ్యం నాకు కాదు. నేను వారి తమ్ముడు లక్ష్మణస్వామి పాత్రను నిర్వహించగలను అని చెప్పడం నాకు చాలా  ఆశ్చర్యం కలిగించింది. మనసులో అనుకోవలసిన మాటలు బయటకు చెప్పారా అనిపించింది.
నిజానికి ఆచార్యుల వారి ఉద్యోగం తంబురా వేయడం  మంచి సున్నితమైన  సంగీత విద్వాంసులు  గాత్రంలో బాలమురళీకృష్ణ గారి తరువాత  దాదాపు వారిలా పాడగలిగిన  గాత్రం ఆయన సొంతం  వారికి ఏ అనుమానం వచ్చినా  వారి అన్నగారు కృష్ణమాచార్యులు గారిని  మాత్రమే అడిగి తన సందేహాన్ని నివృత్తి చేసుకుంటారు. ఆయన ఏ విషయాన్ని గురించైనా  వినడం తప్ప చెప్పడం తక్కువ  అడిగిన వాటికి సమాధానాలు చెప్పడం  ఎంత అనర్గళంగా చెప్పగలరో అనవసరమైన విషయాలను  మాట్లాడకపోవడంలో అంత మౌనాన్ని వహించగలరు. అలాంటి మంచి వాడికి అన్నీ మంచే జరిగాయి కానీ  మా అందరికీ అభిమాన పాత్రమైన వారి  కుమార్తె  మరణం  అతి చిన్న వయసులో జరగడం  వారిని ఎంతో కృంగదీసింది. చిన్నారి సీత మరణం వల్ల  దాదాపు  సగం జీవితాన్ని పోగొట్టుకున్నట్లే  మా అందరికీ అంత చిన్న వయసులోనే ఎన్నో సలహాలు చెప్పగలిగిన  మేధావి  బాల బాలికల పాత్రలు మాతో పాటు అనేక నాటకాలలో పాల్గొన్న చిన్నారి  మరణం మా అందరికీ  విషాదం  కలిగించిన సంఘటన  మాకు ఉదయం జరిగే కార్యక్రమాల్లో  మీటింగులకు  అనేకసార్లు సీత  వారి ఇంటి దగ్గర నుంచి పదార్థాలను తీసుకొచ్చి  మా అందరికీ ఆప్యాయంగా వడ్డించిన రోజులు  ఇప్పటికీ మర్చిపోలేం  మా అందరితో  కన్న బిడ్డలా అందరి ఆప్యాయతలు  పొందిన బంగారు తల్లి మా సీత  చిన్నతనంలోనే  తండ్రి తో పాటు సంగీతాన్ని ఆలపించగలిగిన  సామర్ధ్యాన్ని కూడా తన సొంతం చేసుకున్నది  అలాంటి బిడ్డను మరిచిపోవడం  అసాధ్యం అసంభవం  మాకే ఇలా ఉంటే కుటుంబ సభ్యులకు ఇంకెలా ఉంటుందో ఆలోచించండి.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం