ఆత్మ సాక్షాత్కారం విశిష్టత; - సి.హెచ్.సాయిప్రతాప్
 ఆత్మ అనేది ఒక వస్తువు కాదు. దర్శించడానికి అది దృశ్యమూ కాదు. అది మనచే చూడబడే వస్తువే అయితే.. అది పరిమితమైనదే అవుతుంది. పరిమితమైనది ఎప్పటికైనా నశించాల్సిందే కదా. కాని వేదాలచే నిర్వచించబడిన ఆత్మ అపరిమితమైనది. అది ఏకం, అద్వయం, సర్వవ్యాపకం. అది మనకన్నా వేరు కాదు. కనుక మనం దాన్ని వేరుగా దర్శించలేం. అదై మన హృదయస్థానంలోనే కొలువైవుంది. తల్లి గర్భంలో పిండం రూపుదిద్దుకున్నప్పుడే ప్రవేశించే ఆత్మ వెలుగు రూపంలో సదా కొలువై వుండి, చివరికి జీవుడి ఆఖరు శ్వాసతో శరీరం నుండి నిష్క్రమిస్తుంది.  ఆత్మ దర్శనం అంటే.. అది ‘నేనే’ అని అనుభవం కలుగుతుందంటే.కేవలం యోగులకే కాక, సంసారిక జీవనంలో వున్నవారికి కూడా ఆత్మ సాక్షాత్కారం సాధ్యం అని అనేక మహర్షుల జీవిత చరిత్రలు మనకు చెబుతున్నాయి.
ఆత్మసాక్షాత్కారం అంటే సర్వం ఒక్కటే అనే సత్యాన్ని తెలుసుకోవడం.ఆత్మసాక్షాత్కారం అంటే ఆత్మని పరమాత్మతో ఒక్కటి చెయ్యటం.ఆత్మ సాక్షాత్కారం అంటే మూలాధారచక్రంలో ఉన్న కుండలి శక్తిని మేల్కొలిపి ఆ ప్రాణశక్తిని ఆజ్ఞాచక్రం దాటి సహస్రారమునకు చేర్చడం అని యోగశాస్త్రం బోధిస్తోంది.
సృష్టి స్థితి లయములో స్థితి శాశ్వతమైనది అదే పరబ్రహ్మ స్వరూపమైన శూన్యస్థితి.అంటే నిరాకార పరబ్రహ్మమే శాశ్వతమైన స్థితిని పొందుతున్నాడు మిగిలినది అది ఏదైనా సరే అశాశ్వతమే అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే నిజమైన ఆత్మసాక్షాత్కారము.ప్రతీ జీవి పరమాత్మ (నీ యొక్క) స్వరూపమే అనే సత్యాన్ని తెలుసుకోవడమే ఆత్మసాక్షాత్కారము
ఆత్మ సాక్షాత్కారికి నిరంతర , కఠోర సాధన ఎంతో అవసరం. చిత్తవృత్తిని నిరోధం చేసినవాడే యోగి అవుతాడు. సత్యాన్ని ప్రదర్శించేవాడే ద్రష్ట అవుతాడు. స్వానుభవం ద్వారానే ఆత్మ సాక్షాత్కారం పొందుతాం. మానవులలో ఎవరైతే ధ్యానం చేసి దివ్యచక్షువును ఉత్తేజితం చేసుకుంటారో అతనే’ శివుడు ‘. స్నానం ద్వారా దేహశుద్ధి కలుగుతుంది; పానం ద్వారా దాహం తీరుతుంది. మంత్రం ద్వారా ఉచ్చారణ సరిగ్గా వుండి వాక్కు పటిష్టం అవుతుంది. ధ్యానం ద్వారా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం