నవోదయ లోసీటు సాధించాలంటే ఎలా? ఇల్లూరీ క్రాంతి కుమార్ కొడంగల్ సెల్ 919912386643

 నవోదయ ప్రవేశ పరీక్షJanuary 20--ఆరో తరగతి ప్రవేశాలకు చక్కటి అవకాశం 
నవోదయ విద్యాలయాల్లో సీటు సంపాదించాలనుకునే విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశాలను కోడంగల్ మండలం లోని పాతకోడంగల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇల్లూరీ క్రాంతి కుమార్  చాలా చక్కగా వివరించారు.ఈవిధంగా చదవడం వల్ల సీటు సంపాదించవచ్చు అంటున్నారు ఆయన. మరి విద్యార్థులు ఏవిధంగా ప్రిపేర్ అవ్వాలో వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
జాతీయ విద్యావిధానాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జవహర్‌ నవోదయ విద్యాలయం గ్రామీణ, నిరుపేద విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన కార్పొరేట్‌ స్థాయి ఉచిత విద్యకు చక్కటి అవకాశం.
 విద్యాలయంలో ప్రవేశం కోసం వేలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. 
చిన్న వయసులోనే ప్రవేశ పరీక్షలో పోటీ పడి విజేతలుగా నిలిచే అవకాశం ప్రవేశం లభిస్తే ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నత ప్రమాణాలతో కూడిన అధునాతన విద్య, సంస్కృతీ సంప్రదాయాలతో కూటిన విలువలు, సాహసోపేత కృత్యాలు, క్రీడలు పౌష్టికాహారంతో పాటు సమున్నత శిక్షణ నవోదయ విద్యాలయంలో ఉచితంగా లభిస్తుంది. 
అందుకు సీటు సంపాదించేందుకు విద్యార్థులు తీవ్ర పోటీ పడుతున్నారు. ఆదివారం నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు జిల్లాలో పరీక్ష కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. 
జిల్లాలో  ఉన్న విద్యాలయంలో 80 సీట్లు ఉండగా వేలల్లో ప్రవేశ పరీక్ష రాయనున్నారు. 
గుర్తుంచుకోవాల్సిన అంశాలివీ..
పరీక్షలు రాసే వారందరూ చిన్నారులే కావడంతో ఓసీఆర్‌ షీట్లలో సమాధానాలు గుర్తించాల్సి ఉండటంతో తడబాటు ఉంటుంది.  తడబాటు తొలగించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి. 
‌సమాధానాలు గుర్తించడానికి నీలి, నలుపు బాల్‌పెన్ను మాత్రమే వినియోగించాలి. రఫ్‌ వర్క్‌ చేయాల్సి వస్తే బుక్‌లెట్‌లో 16వ పేజీని వినియోగించుకోవాలి. వేరే పేజీలను వినియోగించవద్దు. 
‌ఒక్కసారి సమాధానం రాసిన తర్వాత మార్చడం, కొట్టివేయడం, దిద్దడం చేయకూడదు. 
‌ఒక ప్రశ్నకు సుమారు నిమిషం పడుతుంది. అందువల్ల అంతకంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు.
 దాన్ని వదిలి మరో ప్రశ్నకు జవాబు రాసే ప్రయత్నం చేయాలి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. నెగిటివ్‌ మార్కులు ఉండవు కాబట్టి వదిలేసిన ప్రశ్నలుంటే అప్పుడు వాటిని ఆలోచించాలి. 
‌బుక్‌లెట్‌లోని మూడు విభాగాల్లో అభ్యర్థులు ఉత్తీర్ణులు కావాల్సిందే. అందువల్ల అవసరానికి మించిన సమయం ఒక్కో విభాగంపై వృథా చేయరాదు. 
‌ప్రతి 30 నిమిషాలకు ఒకసారి గంట కొడతారు. అది గమనించి పరీక్ష రాయాలి. 
‌పరీక్షకు గంట ముందే ఆయా కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష ప్రారంభమైన తరవాత ఒక్క నిమిషం ఆలస్యమైనా ప్రవేశ కేంద్రంలోనికి అనుమతించరు.
ప్రవేశ పరీక్ష మూడు విభాగాలు.. 
‌మేధాశక్తి పరీక్ష 40 ప్రశ్నలు 50 మార్కులు 60 నిమిషాలు 
‌గణితం 20 ప్రశ్నలు 25 మార్కులు 30 నిమిషాలు 
‌భాషా నైపుణ్యానికి సంబంధించి 20 ప్రశ్నలు 25 మార్కులు 30 నిమిషాలు
ప్రవేశ పరీక్ష.. January 20 ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరగనుంది. 
ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ రూపంలో ఉంటాయి. మొత్తం 2 గంటల వ్యవధిలో 100 మార్కులకు మూడు విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
 సమాధానాలు ఐసీఆర్‌ (ఇంటలిజెన్స్‌ క్యారెక్టర్‌ రికగ్నిషన్‌),  ఓసీఆర్‌ (ఆప్టికల్‌ క్యారెక్టర్‌ రికగ్నిషన్‌) షీట్లలో అంకెల రూపంలో గుర్తించాలి. నెగిటివ్‌ మార్కులు ఉండవు.
మూడు విభాగాల్లో పరీక్ష
ప్రవేశ పరీక్ష విరామం లేకుండా రెండుగంటలు కొనసాగుతుంది. వంద మార్కులకు 80 ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉంటుంది. మూడు విభాగాలలో ఈ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగంలో ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కు ఉంటుంది. రీజనింగ్‌ మేథాశక్తిలో 50మార్కులకు 40ప్రశ్నలు, గణితంలో 25 మార్కులకు 20 ప్రశ్నలు, తెలుగు లేదా ఆంగ్ల భాషలో నాలుగు పాసేజ్‌లు ఉంటాయి. ఒక్కో పాఠ్యాంశానికి ఐదు ప్రశ్నలు చొప్పన ఉంటాయి. వీటికి 25 మార్కులు ఉంటాయి.
మేధాశక్తికి అధిక మార్కులు
మేధాశక్తి విభాగంలో 50 మార్కులు ఉంటాయి. బొమ్మలతో కూడిన ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్న కింద నాలుగు సమాధానాలు బొమ్మల రూపంలో ఉంటాయి. ఈప్రక్రియలో సులభంగా మార్కులు పొందడానికి విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా సమయస్పూర్తితో ఆలోచించాల్సి ఉంటుంది. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ఇందులో సులువుగా 45 మార్కులు వరకు పొందే అవకాశం ఉంది.
గణితమే కీలకం
గణిత విభాగంలో 20 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కు వంతున 20 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. గణితంలో ఐదోతరగతి వరకు గల అన్ని చాప్టర్లలో ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడుగుతారు.గణితo లో అధిక మార్కులు సంపాదించ గలిగే విద్యార్ధులు దాదాపుగా నవోదయలో సీటు పొందే అవకాశం ఉంది.
పఠనాసక్తి అంచనా..
భాష పఠనాశక్తిని అంచనా వేసేందుకు భాషా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రశ్నలు 25 మార్కులకు ఉంటాయి. ఈ విభాగంలో ఐదు పాఠ్యాంశాలు ఇస్తారు. ఒక్కో పాఠ్యాంశంలో  ఐదు ప్రశ్నలు వంతున నాలుగు పాఠ్యాంశాలలో 25 మార్కులు ఉంటాయి. పాఠ్యాంశాలు ఆధారంగా ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు అన్ని ఒకేలా ఉంటాయి. నిశితంగా గమనిస్తే సమాధానం కచ్చితంగా గుర్తించవచ్చు.
 అభ్యర్థులకు సూచనలివీ..
పరీక్షకు వెళ్లేటప్పుడు హాల్‌ టిక్కెట్‌, ప్యాడ్‌, నీలం ,నలుపు రంగు పెన్నులు తీసుకువెళ్లాలి ఫ ప్రశ్నపత్రంలో అన్ని పేజీలు ప్రింట్‌, క్రమసంఖ్య మీడియం సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి ఫ పరీక్ష కేంద్రానికి అర్ధగంట ముందుగా వెళ్లాలి ఫ ఓఎంఆర్‌ షీట్‌లో విద్యార్థి వివరాలు ఉంటాయి. వాటిని సరిచూసుకోవాలి.

కామెంట్‌లు