అనగనగ మోకిడి పల్లి అనే ఊర్లో ఒక సర్కారు బడి ఉండేది. ఆ బడిలో ఐదుగురు
ప్రానాస్నే హితులు ఉండేవాళ్ళు. వారు ఈ ఎప్పుడు కలిసి, మెలిసి ఉంటారు. వారు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటు ఉండేవారు. ఆ ఐదుగురు అన్నదమ్ములుగా యే మాట దాచుకునే వారు కాదు ఏది ఉన్న ఒకరి కొకరు చెప్పు కునే వారు. అప్పుడు ఒక రోజు ఆ ఐదుగురిలో ఒకడికి ఒక డబ్బులు ఉన్న డబ్బ దొరుకుతుంది.ఆ డబ్బుని చూడకుండా ఆ డబ్బాను తీసుకొని బడికి వెళ్తాడు. వెళ్తుండగా సార్ దానిని చూసి ఎంట్ర ఈ రోజు డబ్బ పట్టుకొని బడికి వస్తున్నావు అని అడుగుతాడు.అప్పుడు వాడు ఇలా అంటాడు సార్ సార్ మాకు ఇది రోడ్ మీద దొరికింది సార్ దీనిని తెరవ కుండానే తీసుకొచ్చాను సార్. అప్పుడు ఆ సార్ ఇలా అంటాడు అరెరే ఇది ఎందుకు తెచ్చార్రా అలా తేవడం తప్పు అని అంటారు. ఎందుకు సార్ అని ఈ ఐదుగురు అంటారు అప్పుడు సార్ ఇలా అంటాడు. అది ఎవరు పారేసుకున్నారు ఏమో పైగా అందులో డబ్బులు కూడా ఉన్నాయి. పాపం వాళ్లు ఎంత కష్టపడితే వచ్చాయో ఆ డబ్బులు ఏంటో అని అంటాడు సార్. అప్పుడు ఆ సార్ చెప్పినా మాటలు విని దొరికిన డబ్బాను తీసుకొని ఎక్కడ దొరికిందో అక్కడ పెట్టి ఎవరిదో తెలిసేదాకా అక్కడే ఉండి వాళ్లకి అప్పగించి ఇంకా వారు కొన్ని డబ్బులు కూడా వాళ్లకి సహాయం చేస్తారు. ఇక ఆ ఐదుగురు ఇలా అనుకుంటారు అరే సార్ మనకి మంచి మాటలు చెప్పారు. మనం ఇది ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి అని ఆ ఐదుగురు అనుకుంటారు. ఇప్పటినుంచి వీళ్ళు ఏది దొరికినా తీసుకోకుండా వాటిని పారేసుకున్న వాళ్ళు వచ్చేదాకా అక్కడే ఉండి వాటిని ఎక్కడికి వెళ్లకుండా ఉంటారు. ఎందుకంటే వాళ్ల గురువు చెప్పినది గుర్తు పెట్టుకున్నారు కాబట్టి.
--------------------------------------------
నీతి: గురువులు చెప్పే మంచిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. అలాగే వెళ్లే దారిలో ఏది దొరికిన అది మనదే అని అనుకోకూడదు ఎందుకంటే వారి కష్టం మనకి తెలియదు అందుకే ఏదైనా దొరికితే వాళ్లది వాళ్లకి అప్ప చెప్పేదాకా అక్కడే ఉండాలి.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి