తానా అంతర్జాతీయ కవయిత్రుల సమ్మేళనానికి "ప్రత్యేక అతిథిగా ఎస్. రత్నలక్ష్మి"
 ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక  సెప్టెంబర్ 24 వ తేదిన 
ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 
నారీ సాహిత్య భేరీ", అంతర్జాతీయ శతాధిక కవయిత్రుల సమ్మేళనం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,  నంద్యాల జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత్రి  ఎస్. రత్నలక్ష్మిని ప్రత్యేక అతిథిగా తానా  సంస్థ వారు ఆహ్వానించారు.
తానా వారు నిర్వహిస్తున్న ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో కవిత్వం వినిపించటానికి తనకు విశిష్టమైన స్థానాన్ని కల్పించినందుకు తానా అధ్యక్షులు నిరంజన్ శృంగ వరపు గారికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. 
14 గంటల పాటు నిర్విరామంగా జరిగే సాహిత్య సమ్మేళనం ఇది. భారత్ తో పాటు  విశ్వ వ్యాప్తంగా  సుమారు 15 దేశాలకు చెందిన ప్రముఖ తెలుగు కవయిత్రులు, రచయిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
వీరితో పాటు ప్రముఖ మహిళలు పాల్గొంటారు. అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలంలో  జరిగే ఈ కార్యక్రమం 10 కి పైగా మాధ్యమాలలో  ప్రత్యేక్ష ప్రసారం చేస్తారు. 
యాప్ టీవీ ద్వారా యూరోపియన్ దేశాలు,అమెరికా వంటి దేశాల్లో, ఈ టీవీ భారత్, మన టీవీ, తెలుగు వన్, తానా అధికారిక 
యుట్యూబ్ ఫేస్బుక్ చానెల్ వంటి చానెల్ లలో ప్రత్యక్ష ప్రసారం వస్తుంది. ఇటువంటి ప్రత్యేక కార్యక్రమంలో తమను ఎంపిక చేసినందుకు ఎస్. రత్నలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు.
నంద్యాల జిల్లాలో జలవనరుల శాఖకు సంబంధించిన తెలుగుగంగ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఇంజనీరుగా సేవలు అందిస్తున్న ఎస్. రత్నలక్ష్మి అనేకానేక విలక్షణ వచన కవితలు, గేయాలు మరియు పాటలు రచించారు. విశిష్ట రచయిత్రిగా ప్రఖ్యాతి పొందారు.  
సామాజిక & సాహిత్య సేవలో ప్రధాన భూమిక పోషిస్తూ అనేకమంది కవులను ప్రోత్సహిస్తున్నారు. 
ఎస్. రత్నలక్ష్మికి  ఈరోజు  తానా ద్వారా అంతర్జాతీయ గుర్తింపు రావడం పట్ల నంద్యాల జిల్లాలోని పలువురు జిల్లా ప్రముఖులు, పెద్దలు, కవి వరేణ్యులు, పండితులు హర్షం వ్యక్తంచేస్తూ అభినందనలు అందచేశారు.


కామెంట్‌లు