గురుపూజోత్సవ శుభాకాంక్షలు;- వెంకట్ మొలక ప్రత్యేకప్రతినిధి
 వికారాబాద్ జిల్లా కేంద్రం లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం
ఘనంగా నిర్వహించారు.



ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్ర, గౌరవప్రదమైనదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనుల, భూగర్భవనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా మంత్రి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, 75 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ అమిత్ నారాయణ్, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, ఎంపీపీ చంద్రకళ, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి లతో కలిసి ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు, మెమొంటోళ్లతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కనిపించే దైవంగా ఎందరో గొప్ప వ్యక్తులను తీర్చిదిద్దిన ఘనత గ్రామీణ ఉపాధ్యాయులదేనన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని గత తొమ్మిది ఏళ్ల కాలంలో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం 1 లక్ష 87 వేల కోట్ల నిధులను ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థుల కోసం బీసి, ఎస్సి, ఎస్టి, మైనార్టీ గురుకులాలను స్థాపించి 12 వేల పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బాధ్యతగా తీసుకొని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు సహకరించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మండల విద్యాశాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు
కామెంట్‌లు