ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్,- ఆకాశవాణి,- విజయవాడ కేంద్రం- 9492811322.
 ప్రతి సంవత్సరం మేము కార్యక్రమం చేసిన తర్వాత జిల్లెళ్ల మూడి అమ్మ దగ్గరకు వెళ్లి ఆశీస్సులు తీసుకొని పంపడం  అలవాటు చేసుకున్నాం దానికి బహుమతి రావడం సహజం. 82 లో న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి చాలా బాగా వచ్చింది  నాయిక నవ్వులే దానికి జీవం  ఆ పాత్రకు శారద శ్రీనివాసన్ ని గుర్తించి తీసుకొచ్చాం  దానిని అమ్మ దగ్గరకు తీసుకెళ్లి  ఆమె పాదాలపై పెట్టిన తర్వాత ఏమి చెప్పలేదు  సాయంత్రం భోజనాలు చేసిన తర్వాత బయలుదేరుతుండగా మీరు ఎంతో కష్టపడి రికార్డ్ చేశారు కదరా పంపించండి అన్నది  ఆనందంతో తిరిగి వచ్చాం కానీ బహుమతి మాత్రం రాలేదు  అయితే అమ్మ ఎందుకు పంపమన్నది మాకు అర్థం కాలేదు  ఊహించని అనుకోని విషయం ఏమిటంటే  మార్చిలో జర్మనీ నుంచి టెలిగ్రామ్ ఎస్డి కు వచ్చింది. మీరు పంపిన న స్త్రీ స్వాతంత్ర్య మర్హతికి బహుమతి వచ్చింది అని కొంత డబ్బుతో చెక్కు కూడా పంపించారు  అమ్మ దగ్గరకు వెళ్లి చెపితే ఆవిడ ముసి ముసి నవ్వులు  నవ్వింది  తర్వాత ఇష్టాగోష్టిగా అమ్మా భోజనం చేయకపోతే  శరీరం 
క్షీణించి పోతుంది కదా అంటే  నేను స్నానం చేసేటప్పుడు ఎంత ఎక్కువ నీళ్లు పోస్తే అంత భోజనం చేసిన తృప్తి కడుగుతున్నది అని చెప్పింది  విజయవాడ వచ్చిన తర్వాత నాన్న గారిని అడిగితే  పాము ఏం తింటుంది ఎలా బ్రతుకుతుంది గాలి పిల్చే కదా ఆ గాలిలో ఉన్న ఆక్సిజన్ తీసుకుంటుంది  ఆ గుణాన్ని భగవంతుడు ఇచ్చాడు అలాగే అమ్మకు నీళ్లలో ఉన్న ఆక్సిజన్ తీసుకునే వనరు  భగవంతుడు స్వతహాశక్తిగా ఇచ్చాడు అని సమాధానం చెప్పాడు  వారి ఆధ్యాత్మిక విషయాలే కాక  భౌతిక విషయాలను కూడా ఎంతో సమర్థనీయంగా  ఉదాహరించగలరు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే కాకుండ కాలేజీ విద్యార్ధిగా ఉన్నప్పటి నుంచి ఒకే దగ్గర ఉన్న వాళ్ళం  మొదటి నుంచి నాటకాలు అంటే చాలా ఇష్టం  పడాల రామారావు గారు రాసిన సీతారామరాజు నాటకాన్ని చూసి  తనకు కావలసిన భాషలో తాను ప్రత్యేకంగా సీతారామరాజు పాత్రను తీర్చిదిద్ది  ఎక్కడా రాజీ పడకుండా ఖర్చుకు వెనకాడకుండా సాంకేతిక విలువలను జోడించి  స్పోర్ట్స్ లైటింగ్లను కూడా వాడి ఓ కళాఖండంగా తీర్చిదిద్దాడు  ప్రఖ్యాత నాటక విమర్శకులు  ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు గారు అంటే  ఆయనను మించిన మానవతవాడి మరొకరు లేరు  అని నమ్మిన నాన్నగారు వెంకట్ రాజు గారి నుంచి  అద్భుతమైన కళాఖండాలను ఆస్వాదించే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేడు జనార్దన్ రెడ్డి వరకు అందరి ప్రశంసలను పొందాడు  ఎవరిని ప్రశంసించని మా పి ఎస్ సుబ్రహ్మణ్య భట్టు కూడా  న్యాయ నిర్ణయాధికారిగా వచ్చిన బోసు జ్ఞాపకశక్తిని పాత్రలను అర్థం చేసుకోవడం గురించి ఎంతగానో కొనియాడేవారు.


కామెంట్‌లు