దుబాయ్ లో ఘనంగా చిగురుమళ్ళ శ్రీనివాస్ 100 దేశాల శాంతియాత్ర;- డా. అరుణ కోదాటి - హైదరాబాద్
 దుబాయ్, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ లో చిగురుమళ్ళ శ్రీనివాస్ నిర్వహిస్తున్న 100 దేశాలలో శాంతి సద్భావనా ప్రపంచ యాత్ర ఘనంగా జరిగింది. 
తెలుగు అసోసియేషన్ ఆఫ్ దుబాయ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వందలాది మంది ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ దుబాయ్ అధ్యక్షులు వివేకానంద బలుసా మాట్లాడుతూ 
శత శతక కవి చిగురుమళ్ళ విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటటానికి సాహిత్యం ద్వారా సామాజిక చైతన్య కలిగించడానికి "వందే విశ్వమాతరమ్" పేరుతో వంద దేశాల శాంతి సద్భావనా యాత్ర నిర్వహించటం, అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన లాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. 
చిగురుమళ్ళ మాట్లాడుతూ తానా మరియు 100 దేశాలలో ఉన్న వందకు పైగా తెలుగు సంఘాల సమన్వయంతో తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, వందేవిశ్వ మాతరమ్ చైర్మన్ 
జయశేఖర్ తాళ్ళూరి సారథ్యంలో ఈ బృహత్ అక్షర యజ్ఞం జరుగుతోంది. 
నవంబర్ తొమ్మిదో తారీఖున బోట్స్ వానాలో ప్రారంభించి, ఆఫ్రికా ఖండంలోని దేశాల యాత్ర అనంతరం రెండవ దశలో భాగంగా మధ్య ప్రాచ్య  దేశాల శాంతి యాత్ర నిర్వహిస్తున్నాము. మానవ ప్రవర్తనలో పరివర్తన తీసుకురావడం సాహిత్యం ద్వారా  సాధ్యమవుతుందని అన్నారు.
మధ్య ప్రాచ్య దేశాల యాత్ర కన్వీనర్ లుగా సుధాకర్ కుదరవల్లి, విక్రమ్ సుఖవాసి వ్యవహరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో
ఫహీద్, విజయభాస్కర్, లతా నాగేష్ 
  తదితరులు *పాల్గొన్నారు.


కామెంట్‌లు