నీరు-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 భానుని ప్రచండతాపానికి 
ఆవిరిగా మారి మేఘమవుతుంది 
గాలి తాకిడికి 
ద్రవంగా మారి చినుకౌతుంది 
చినుకు చినుకు వర్షం 
నీరుగా మారి 
అమాంతం బావులు, కుంటలు, 
చెరువులు, కాలువలు, నదులై 
పారి పారి పారి పారి 
సాగరుని చేరుతుంది
ఈలోగా
సర్వ ప్రాణికోటి 
దాహార్తి తీర్చి, ఆకలిని తీర్చి 
పనిలోపనిగా 
జనాల పాపాలను కడిగేసి 
తాను ధన్యమవుతోంది
నిజంగా
నీరు ఎంత గొప్పదోకదా!!
**************************************

కామెంట్‌లు