: మతోన్మాదులపై విజయం.;- కేశరాజు వేంకట ప్రభాకర్ రావు-పాతర్లపాడు ఖమ్మం.
ఐక్యత లేని సమాజంలో
కంటిలో నలకల్లా
స్వార్థం నిండిన కొంతమందితో 
పక్కలో బల్లెం లా
దేశ ద్రోహులు 
దేశం నిండా ముళ్ళపొదల్లా
గోతి దగ్గర నక్కల్లా ఎదురు చూస్తు !!

అంతర్గతంగానే
ఆంతరంగికులే అసూయతో
అంతఃపుర కుట్రలతో
అంటకాగుతూనే
అధఃపాతాళం తొక్కేసి
అంతం చేస్తున్న
ఆత్మ బంధువుల పడగ నీడలో, పాలకులైన రాజులు!!

వెరసి
పద్ధతి లేని ఒక నిబద్ధత నిబంధనలు లేని
అనేక ఆచార వ్యవహారాల మధ్య
అనైక్యతతో పరాధీనమైన సనాతన భారత మాత!!

చిన్న చిన్న సంస్థానాలు
పెద్ద పెద్ద సామ్రాజ్యాలు
ఒకరికొకరికి పొసగని వైనం 
సహకరించుకొనుటే తెలియని కుసంస్కారం!!

అందుకే
ఒక తురుష్కుడైన కిరాతక తైమూర్ ఖాన్
వంశజుడు,బాబర్ దాడి చేసి నేలమట్టము చేసిన మందిరంపై బాబ్రీ మసీదు నిర్మించి
ఫైసలా బాద్ గా అయోధ్య పేరు మార్చగలిగాడు !!

దులుదుండ వనంలో
తులసి మొక్క‌లు చిగురు వేసినట్లు
దేశభక్తులు, సాధువులు సన్యాసులు 
ఆత్మ గౌరవం కలిగిన సామాన్యులు
రాముని సైన్యమై అజేయంగా ముందుకు మున్ముందుకు
అనిలో కొనసాగుతూనే వున్నారు!!

నాటి నుంచి నేటి వరకు
అలుపెరుగక అసిగాయాలైనా,
అనంతవాయువల్లో ప్రాణాలు కలిసి పోయిన సంఘటనలకు,
అనేక లక్షల మంది రుధిర తర్పణాలకు ,సరయూనది
సాక్షీ భూతమై నిలిచింది!!

అదే తీరు పారతంత్ర్యంలోను
అదే పీడ స్వాతంత్ర్య భారత దేశంలో కూడా
విస్మయం వ్యక్తమవుతోంది కదూ,
వ్యక్తం కాకపోతేనే...
ఆలోచించాలి!

రామ భక్తులను 
అనేక వేల మంది కరసేవకులను తుపాకీ గుళ్ళ
జడివానతో గుండెలు పేల్చి గొంతుల్లో కాల్చి 
సరయూనదిలో విసిరి పారేసిన పాషండులు
మన స్వతంత్ర భారతావని పాలకులే సుమా !!

అయినా! ఆగలేదు ఆ పోరు !
ఆ విష వృక్షం పెకిలించే వరకు!వేర్లతో సహా !

అంతిమ పోరులో!
అమరపురికేగిన కరసేవకుల ఆత్మ సాక్షిగా 
అత్యున్నత న్యాయస్థానం
ఆదేశముతో
అయోధ్యలో అంగరంగ వైభవంగా
ఆ బాలరాముని పునః ప్రతిష్ఠ!!

నింగి నేల
ఒక్కటై
చేసుకుంటున్న 
సంబరాల మధ్య జరుగుతోంది!!

అందరి మదిని ఆనందనిలయం చేస్తుంది
అందరినీ ఐక్యత పరుస్తూ
ఆదర్శమై మార్గ నిర్దేశం చేస్తుంది 
అనంత కాలాలకు స్ఫూర్తినిస్తూ !!


కామెంట్‌లు