ఏక సందాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.

 మిగిలిన వీరులందరూ నిదానంగా తప్పుకున్నారు  ఆ అడవిలో అదృశ్యమైపోయారు  గంటం దొర ఒక్కడే కాలుస్తూ సైన్యంలో ఉన్న కొంతమందిని చంపాడు  తూటాలు లేవు  తొలగిపోవడం ధర్మం కాదు  అంటూ సేనల ముందుకు చేరి నిలిచాడు  అప్పుడు వారు  ఆ ధీర విగ్రహాన్ని చూసి దొరలు భయపడిపోయారు  గంటం దొర దగ్గరకు రావడానికి ఎంతో భయపడిపోతున్నారు  పట్టుకోవడానికి భయం వేసి మతి తప్పి తుపాకులు కాల్చడం మొదలుపెట్టారు  దానిలో ఒక గుండు  గంటం దొర గుండెపై పేలింది. ఆ గంటం దొర భూమిపై పడిపోయాడు  రామరాజుకు జై రామరాజుకు జై అని  నినాదాలు చేస్తూ  ఒక వీర తార లేడు రాలిపోయింది  ఆంధ్ర దేశానఆపాల గోపాలం అశ్రుతర్పణమిచ్చింది  జాను తెలుగులో అతని చరిత్రను పాడారు  జానపదాలతో అతడిని జానపదులు గంటం దొరను కీర్తించారు.

పత్రికలు స్పందించి అనేక సందేహాలను  వెలిబుచ్చుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగారు  మన్నె గ్రామాలన్నీ తమ ఇంటి మనిషిగా తలచి భక్తితో దినము చేసినారు దేశభక్తులు తమ దేహ భాగం ఒకటి కూలిపోతిమి అంటూ పలికారు  అతని చరిత్ర అందరూ ఆలకించి  కవులు కవితలను అల్లారు  కలకాలం నిలిచి ఉండడానికి  చిడు ముముడి పలుకుల చిరుతప్రాయముననే నా దేశ విధి అని నడిచింది ఎవరు  పుణ్యభారత భూమి పూర్వవైభవ దీప్తి తిలకించి పులకించి తెలిపినది ఎవడు  దేశభాషలలోని తీయందనాన్ని త్రాగి విదేశ భాషల విడిచినది ఎవరు  అజ్ఞాన తిమిరాల అణగారిపోయిన మన్య జాతి గతిని మార్చినది ఎవరు  ధీరుడై సామ్రాజ్యవాదులు అనేది విజయలక్ష్మి వీరుడు ఎవరు  అతడు విప్లవ వీరసార్థకముడైన అల్లూరి రామరాజు. వీరుల చర్చలో తన వాణి వినిపించి పేరుపేరునా వారిని పలకరించి వెళ్లిపోయిన రాజు  తెలియలేదు ఏమాయనో మూడు రోజుల నుంచి జాడలేదు  ఆయన ఆజ్ఞతో అగ్గిరాజు వెళ్ళాడు దొరలతో పోరాడి దొరికిపోయాడు  రాజు పోలికతోడ రాణించేటువంటి ముగ్గురు కనిపించలేదు ఏమి కారణం తెలియడం లేదు  వేషములు మార్చి ఇరువురు వెళ్లిపోయారు  మూడవ వాడు ఎందుకు కలిసినాడో అలా చెప్పిన మాటలా చర్యల పొదలచే వీరులు  తలచిరి ఆ దండు విడిచి  గ్రామాల ప్రజలలో కలిశారు కొందరు పోరాడి కొందరు పట్టుబట్టి బహుమతులను ఆశించి పాపులు కొందరు   బందీలైనారు కొంతమంది  కొంతమంది పోరాడి కొన ఊపిరి ఉండగానే ఆత్మహత్యలు చేసుకున్నారు కొందరు మహిళలు కొంగు ఉరిగా చేసి మా దొరకు జై అనుచు వీరమరణం పొందారు.


కామెంట్‌లు