కడుములో పదోతరగతి విద్యార్ధుల వీడ్కోలు సమావేశం
 కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదోతరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ గల పౌరులుగా ఎదిగి గొప్ప భవితవ్యాన్ని పొందాలంటూ ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. దేశభక్తితో మెలగాలని వక్తలంతా ప్రసంగించారు. విద్యార్థులంతా ఈ వేదికపై ఆటా, పాటా, మాటలతో ఘనంగా నృత్య ప్రదర్శన, జానపద రూపాలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు. ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన ప్రతిభా పోటీల్లో విజేతలకు సర్పంచ్ గుజ్జ రామారావు, ఎంపిటిసి వలురోతు గోవిందరావు, మాజీ సర్పంచ్ వలురోతు ధర్మారావు, 
పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ బూరాడ రమేష్, వైస్ చైర్మన్ భూపతి లక్ష్మి, ఉపాధ్యాయుల చేతులమీదుగా బహుమతులను అందజేసారు. ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్ నిపుణులు టొంపల మౌనిక హాజరై, విద్యార్థులు టేబ్ లను వినియోగించుటలో, టెక్నాలజీ కి సంబంధించిన పలు కీలక అంశాలను తెలిపారు. 
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, వై. నరేంద్ర కుమార్, రబి కుమార్ మహా పాత్రో, సుస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణ పాల్గొన్నారు.
కామెంట్‌లు