కవితార్పణం;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కవిత
ఆనందం
కలిగించాలి

కయిత
అమృతం
చిందాలి

కైత
మనసులను
మురిపించాలి

ఈ కవితను
చూస్తున్నారుగా
చదువుతున్నారుగా

కొన్ని అక్షరాలు
కనపడుతున్నాయిగా
కవ్విస్తున్నాయిగా

కొన్ని పదాలు
ప్రకాశిస్తున్నాయిగా
పలుకరిస్తున్నాయిగా

కొన్ని అర్ధాలు
స్ఫురిస్తున్నాయిగా
మదినితడుతున్నాయిగా

ఆ కవిత్వం
నేనేకూర్చానుగా
నేనేపేర్చానుగా

ఆ కవనంపై
పరిమళాలు
చల్లానుగా

ఆ వ్రాతలకు
తియ్యదనాలు
అద్దానుగా

ఈ అల్లికపై
వెలుగులు
విరజిమ్మానుగా

ఈ  కైతపై
తేనెచుక్కలు
పూచానుగా

ఈ కవితకు
నేనే రూపకర్తను
నేనే భావకుడను

ఈ కవనం
నా సృష్టే
నా కృషే

ఈ కయితకు
కర్తనునేనే
కర్మనునేనే

ఈ కవిని
మళ్ళీమళ్ళీతలుస్తారుగా
మదిలోనిలుపుకుంటారుగా

కామెంట్‌లు