సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం.
 న్యాయాలు-445
కలంజ న్యాయము
****
కలంజము అంటే పక్షి, గంజాయి,విష లిప్త బాణముచేత చంపబడిన మృగ మాంసముఅనే అర్థాలు ఉన్నాయి.
 
కలంజము అంటే తెలిసిపోయింది కదా!ముఖ్యంగా విష లిప్త బాణముచేత చంపబడిన మృగ/ పశువు మాంసమని. మరలాంటి విషము చేత చంపబడిన పశువు మాంసం తిన్న మనుషులకు హాని కలుగుతుంది.మరణం కూడా సంభవించవచ్చు.కాబట్టి "న కలంజం భక్షయితవ్యం న లశునం నగృంజనం చ" అని అధికారికంగా దానిని ఓ విధి వాక్యము, శాస్త్రబద్ధం చేశారు.
ఇందులో గృంజనము అంటే కూడా వెల్లుల్లి మరియు విషము తిన్న పశువు యొక్క మాంసమని అర్థము. ఇప్పటికీ వెల్లుల్లిని చాలా మంది తినరు.దానిని నిషిద్ధ పదార్థంగా భావిస్తారు.కొన్ని కుటుంబాల్లో , కొన్ని పూజలు, వ్రతాలు,ఉపవాసాల్లో ఉల్లి, వెల్లుల్లి పూర్తిగా నిషిద్ధము.వాటిని వంటకాల్లో అస్సలు  ఉపయోగించరు.
ఈ విధంగా శాస్త్ర మీమాంస శాస్త్రజ్ఞులు "అభక్షణం కర్తవ్యం" అనగా తినరానిది కాబట్టి తినకుండా ఉండాలనీ, "భక్షణం న కర్తవ్యం" తినడం అనేది చేయకూడనీ... ఇలా ఎటు తిప్పి చెప్పినా అర్థము ఒక్కటే.అలాంటివి తినకూడదని, వాటిని  ఓ సిద్ధాంతంగా చెప్పారన్న మాట.
అలా చెప్పడం వల్ల వినే వారికి భయం, భక్తి రెండూ కలుగుతాయి.తింటే ఏ ఆపద సంభవిస్తుందోనని భయం ఒకవైపు అయితే, పెద్దలు చెప్పిన మాట కాబట్టి ఖచ్చితంగా ఆచరించాలనే భక్తి మరోవైపు.ఇలా రెండు విధాలుగా మనుషులను అలాంటి పనులు చేయనీయవు.
ఇక మన ఇళ్ళల్లో పాటించే ఆచార వ్యవహారాలు గమనిస్తే  ఇలాంటి విషయాలు చాలా  చాలా తెలుస్తాయి.
అందులో కొన్నింటిని చూద్దాము.
ఇప్పుడంటే గడపలకు  రంగులు వచ్చాయి.గతంలో గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు , బియ్యం పిండి బొట్లు పెట్టే వారు.పసుపు క్రిమి సంహారిణి కాబట్టి క్రిమి కీటకాలను లోపలికి రానివ్వకుండా వుంటుందని  పెద్ద తరానికి తెలుసు.
అలాగే ఎంత ఖరీదైన చెప్పులయినా గడప దాటి లోపలికి తీసుకొని రాకూడదని కట్టడి  చేసేవారు.కారణం బయట తిరిగినప్పుడు అనేక కలుషితాలు చెప్పులకు అంటుకునే ప్రమాదం ఉంటుంది. వాటి వల్ల అనారోగ్యం కలుగుతుంది.కాబట్టి  ఎంత ఖరీదైన పాదరక్షలైనా వాటి స్థానం గడపవతలే అనే వారు.
 ఇలా ఎన్నో , ఎన్నెన్నో ఆరోగ్య సూత్రాలను ఆచారాలకు ముడిపెట్టి చెప్పారు. అందులో భాగంగా ఇదీ ఒకటని అర్థం చేసుకోవచ్చు.
 మామూలు మాటల్లో చెబితే ఎవరూ వినరు,ఆ మాటలు అస్సలు పట్టించుకోరని మన  పెద్దవాళ్ళకు తెలుసు. అందుకే ఎన్నో మంచి అలవాట్లనూ, ఆరోగ్య సూత్రాలను సంస్కృతీ సంప్రదాయాల పేరుతో ఆచార వ్యవహారాలకు ముడిపెట్టి వాటిని ఆచరించే విధంగా మానవ జీవితంలోకి ప్రవేశపెట్టారు.
 చాలా మందికి  ఈ ఆచార వ్యవహారాల సంగతేమిటో తెలియకున్నా ఫర్వాలేదు.  పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఆచరణలో వాటిని చూపమని అన్నారు.
అలాంటి వాటిలో "కలంజ న్యాయము"ముందు వరుసలో ఉంటుందనడానికి ఎలాంటి సందేహమూ లేదు‌అంతే కదండీ!
 మనము కూడా ఆచారాల వెనుక ఉన్న ఆంతర్యం, ఆరోగ్య సూత్రాల నియమాలు తెలుసుకుని సంతోషంగా ఆచరిస్తూ, అందులోని మంచిని నలుగురు గ్రహించి ఆచరించేలా చూద్దాం .మన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం