కదంబం;-డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961.

 భారత దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలు వారి భాషలలో నిష్ణాతులు ఎవరి భాష వారికి ఆనందాన్నిస్తుంది  తృప్తినీ ఇస్తుంది అయితే ఏ రాష్ట్రంలోని ఏ భాష కూడా స్వతంత్రంగా ఉద్భవించినది కాదు  రకరకాల అక్షరాలను ఆ భాషలలో చేర్చి ఆ భాషను పరిషత్తు చేస్తూ ఉంటారు  మన భాష ఆంధ్ర భాష కావడానికి  మొదట తెనుగులో తెలుగు చేయడానికి  19 అక్షరాలను సంస్కృతం నుంచి తెచ్చుకున్నాం మరొక అక్షరం ప్రాకృతం నుంచి వచ్చింది కనుక 56 అక్షరాలతో పరిణతి చెందిన పరిపూర్ణ ఆంధ్ర భాషగా  విరాజిల్లుతుంది అలాగే మిగిలిన భాషలు కూడా  ఉదాహరణకు లంబాడీ  భాషను తీసుకున్నట్లయితే నిజానికి అది  భాష కానే కాదు  వారి మాతృభాష గుజరాతి.
గుజరాత్ నుంచి మన ప్రాంతానికి వచ్చిన లంబాడీలు  వారి మాతృభాష గుజరాతిని మన భాష ఆంధ్ర ను జతచేసి సంకరభాషగా తయారుచేసి  దానిని వాడడం మనం గమనించవచ్చు లోతుగా విశ్లేషిస్తే వారు ఏ ప్రాంతానికి వలస వెళితే వారి మాతృభాషతో కలిపి ఆ రాష్ట్ర భాషను తమ సొంతం చేసుకొని గుజరాతి లోకి మార్చుకొని దానిని తమ సొంత భాషగా వాడడం జరుగుతుంది  ప్రపంచ భాషలన్నిటిని ఒక్కసారి క్రోడీకరించినట్లయితే  లాటిన్ పార్సీ లాంటి భాషల నుంచి అక్షరాలను కొన్నిటిని అరుగు తెచ్చుకొని మిగిలిన నా పాఠశాల వాడుకొని దానినే తమ సొంత భాషగా తీర్చిదిద్దడం వల్ల అది పరిపూర్ణ భాషగా ఖ్యాతి చెందింది  ఇదీ భాష  పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన విషయం. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్న సమయంలో  చిన్న చిన్న చెరువుల వద్దకు వెళ్లి అక్కడ ఉన్న తామర పువ్వులను చూస్తూ ఎంతో ఆనందిస్తూ ఉంటారు  ఆ పట్నం కొన్ని పూలు గా ఉంటాయి కొన్ని పుష్పాలుగా వికసిస్తాయి  అది రేకులు విప్పి నీటి పైన అలా కనిపిస్తూ ఉంటే పిల్లలు అయినా పెద్దలైనా ఆ సొగసును చూసి ఆనందించి పరవశం  పొందే వారే తప్ప రెండో ఆలోచన లేదు  అది ఎంతో పవిత్రమైన పుష్పం  కనుకనే  స్త్రీలను చక్కటి కన్నులు ఉన్న  అమ్మాయిని పద్మలోచన  అంటాం  మనకు జన్మనిచ్చిన బ్రహ్మ  మనల్ని పెంచుతున్న విష్ణువు  ఉదాహరణగా తీసుకున్నట్లయితే  బ్రహ్మ కూర్చునేది పద్మంలోనే  లక్ష్మీదేవి పద్మంలో కూర్చోవడమే కాకుండా రెండు చేతులతో రెండు పద్మాలను పుచ్చుకుంటుంది.

కామెంట్‌లు