కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 మనం చనిపోతే అయ్యో పాపం చనిపోయాడా అంత మంచి మనిషి ఇంత త్వరగా చనిపోవడం ఏమిటి అని  ప్రజలు అనుకోవాలి తప్ప పోతే పోయాడు సగం ఫీడా వదిలిపోయింది ఒక రాక్షసుడు ఈ సమాజం నుంచి దూరం అయ్యాడు  అనుకునే స్థితి తీసుకురావద్దు  అలా జరగాలంటే నీ జీవితంలో ఎలాంటి పొరపుచ్చాలు లేకుండా  ఎవరికి కష్టం కలిగించకుండా  జీవితాన్ని క్రమబద్ధంగా నడుపుకోవడమే మార్గం  అలాంటి జీవితాన్ని మనం ఎందుకు కొనసాగించకూడదు అని ఆలోచన చేసే  మంచిని సంపాదించుకుంటూ చక్కని పేరుని తెచ్చుకున్నట్లైతే  నీకు నీ వంశానికి కీర్తి ప్రతిష్టలు మిగులుతాయి  లేకుంటే రావణాసురునికి పట్టిన గతే మనకు పట్టే అవకాశం ఉంది అని మాత్రం మరిచిపోవద్దు.
ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు  మనకు చెప్పే మొదటి పాఠం  నీవు ఆస్తి పాస్తులు ఎంత సంపాదించినా  ప్రతి వస్తువు కొనగలిగిన స్థితి ఉన్న  దానిని తినగలిగే ఆరోగ్యం నీ సొంతం  కానప్పుడు ఆ మొత్తం వృధా అవుతుంది  కనుక నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నీ మీదే ఉంది  ఎవరో వేరే వచ్చి ఏ ఒక్కరు నీకు ఈ విషయంలో సాయం చేయరు  నీవు ఆస్తి సంపాదించడం అంటే ఆరోగ్యాన్ని సంపాదించడం అని అర్థం  దానితో ఎంత సంతోషంగా ఉంటావో నీకు  అనుభవిస్తే తప్ప తెలియదు  నీవు ఎప్పుడైనా సమస్యలలో చిక్కుకున్నప్పుడు  ఆ చిక్కులను విడిపించే తాళం చెవి ఈ సంతోషం  అన్న విషయాన్ని మర్చిపోవద్దు  కనుక ఆరోగ్యాన్ని కాపాడుకో  అనే అమ్మ అనుక్షణం బిడ్డలకు చెబుతూ ఉండాలి. చిన్నపిల్లలు ఆటకాయితనంగా బావి దగ్గరకు వెళ్లి  తాబేలు ఎప్పుడు పైకి వస్తుందా దాన్ని ఎప్పుడు చూద్దామా అని ముచ్చట పడతారు అది బయటకు వచ్చి తల మాత్రం బయటకు పెట్టి కాడికి పిలుచుకొని తిరిగి ఈత కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది దాని కార్యక్రమాలు చూసి పిల్లలు ఎంతో ఆనందిస్తారు  అయితే దీనివల్ల నేర్చుకోవలసినది ఏమిటి అది దాని సహజ లక్షణం కదా అనిపించవచ్చు ఇవాళ దేశంలో యోగ  ప్రతి ఇంటిలోనూ వ్యాప్తి చెందింది దానికి కారణం తాబేలు  యోగాలో ఏం చెప్తారు పంచంద్రియాలను తన స్వాధీనం చేసుకుని కేంద్రీకృతం చేసి ఏ విషయాన్ని గురించి నీవు చేయ తలుచుకున్నావో ఆ విషయాన్ని గురించి తపస్సు చేయి అని చెబుతారు  మరి ఆ తాబేలుకు ఎవరు చెప్పారు.

కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం