అనంతారం ఊరులో తిరుపతి రైతు ఉన్నాడు. అతనికి రెండు ఎకరాల పొలం ఉంది. సాగు చేసి పంట తీస్తున్నాడు. తన పొలం పక్కన ఒర్రె ఉంది. తిరుపతికి దురాశపుట్టింది. ఒర్రెను చదును చేయాలని తలిచాడు. తన పొలంలో కలిసితే పావు ఎకరం కలుస్తుందని అతి ఆశ పడ్డాడు. ఒర్రెను చదునుచేసి పొలంలో కలిపాడు. రాములు సహజత్వంను దెబ్బతీయకూడదన్నాడు. నష్టపోతావు అని తెలిపాడు. వానకాలంలో వరద వచ్చింది. బురదమట్టి అంతా మేటవేసింది. రెండు ఎకరాల వరిపొలం నాశనమయింది. తిరుపతి నెత్తి నోరు బాదుకొని ఏడ్చాడు.
*" సహజమైనది చెడగొట్టద్దు"*;- *డా.వాసరవేణి పరశురాం, బాలసాహిత్య రచయిత,సింగారం, రాజన్న సిరిసిల్ల*
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి