సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-470
కూష్మాండ స్తేయ న్యాయము
*****
కూష్మాండము అనగా గుమ్మడి కాయ, పిశాచ భేదము అనే అర్థాలు ఉన్నాయి.అస్తేయము అనగా దొంగతనం చేయకుండుట, దొంగ తనం చేయని అని అర్థము.
 "గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు"
అంటే ఏదైనా తప్పు చేసిన వాళ్ళు దాని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఉలిక్కిపడటాన్ని,తన తప్పుని తానే బయటపెట్టుకునే సందర్భంలో మన పెద్దలు ఈ సామెతను ఉదాహరణగా చెబుతుంటారు.
వెనుకటికెవరో  గుమ్మడికాయల దొంగెవరు అంటే తన భుజాలు తడుముకున్నాట్ట.అంటే తాను దొంగిలించి భుజాలపై మోసుకెళ్ళిన బూడిద లాంటి చిహ్నాలు భుజాలపై ఉన్నాయేమో  చూసుకుంటున్నాడుట.నిజముగా దొంగతనం చేయని వాడైతే కదలక మెదలక ధైర్యంగా వుండాలి కదా!ఎవరైనా తప్పు చేసి తొట్రుపాటులో వున్నప్పుడు ఈ సామెతను వాడుతారు.
చిన్నప్పుడు మన తాతయ్యలు,నాన్నమ్మ, అమ్మమ్మలు ఇంట్లో పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని ఇలాంటి సామెతల కథలు చెప్పేవారు.
ఆ రోజుల్లో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలే ఉండేవి.వివిధ వయసుల వారీగా పిల్లలతో ఇల్లంతా సందడిగా వుండేది.
పిల్లలంటే పిల్లలే.అల్లరి పనులకు చిరునామాలు కదా! ఇంట్లో చేసిన ఇష్టమైన పిండి వంటలు, పండ్లు మొదలైనవి అందరికీ సమానంగా పంచి ఇచ్చినా పిల్లల్లో మరికొన్ని తినాలని అనిపించడం, పంచదార లాంటివి ఇష్టం కాబట్టి వంటింట్లోకి వెళ్ళి ఎవరూ చూడకుండా డబ్బాల్లో ఉన్నది  గబుక్కున నోట్లో పోసుకుని రావడం చేసేవారు.
ఎంత చూడకూడదు అనుకున్నా అక్కడ వాటి తాలూకు ఆనవాళ్లు కనిపించేవి.
అమ్మలైతే నిలదీసి గద్దించడమో,తప్పు చేయొద్దని కొట్టడమో చేస్తారు కానీ అమ్మమ్మ, బామ్మ, తాతలు అలా కాకుండా అలా చేయడం తప్పని వాళ్ళంతట వాళ్ళు తెలుసుకునేలా ఇలాంటి సామెతలను ఉదహరిస్తూ బోలెడన్ని కథలు చెప్పేవారు.అలా పిల్లల్లో  చక్కని మార్పుతో నైతిక విలువలు పెంపొందేవి.
 అలా మన తాతలు, బామ్మ, అమ్మమ్మలు చెప్పిన కథ మరోసారి మనం గుర్తుచేసుకుందామా.
ఒక ఊరిలో ఓ రైతు పెరట్లో బూడిద గుమ్మడి కాయ తీగ పాకి కాయలు కాస్తోంది. ఆ  రైతు ఆ కాయలతో వడియాలు పెట్టుకుందాం, పులుసు వండుకుందాం అనుకుని  ఓ రోజు కోద్దామని చూసేసరికి కాయలు కనబడలేదు.ఎవరో కోసుకుని వుంటారని అర్థమై పోయింది. ఇలా ఒకటి రెండు సార్లు కాయలు కోసుకుందాం అనుకునే లోపే ఎవరో కోసుకుని పోవడంతో రైతుకు చాలా బాధ కలిగింది.
వెంటనే ఆ వూర్లో పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళి పరిస్థితి మొర పెట్టుకున్నాడు.
ఎవరి మీద అయితే అనుమానం వుందో వాళ్ళందరినీ రమ్మనమని పిలిపిస్తాడు.అలా వచ్చిన వారందర్నీ  కూర్చో బెట్టి గుమ్మడి కాయల దొంగతనం విషయం చెప్పి,"ఎవరైతే గుమ్మడి కాయలు దొంగతనం చేస్తారో వారికి వీపు మీద సొట్ట పడుతుంది" అని ఇంకా చెప్పబోయేటప్పటికే రైతు ఇంటి పక్కనే ఉంటున్న వ్యక్తి భుజాలను తడుముకోవడం ఆ పెద్ద మనిషి గమనిస్తాడు.ఇంకా విషయం పొడిగించకుండా ఆ వ్యక్తిని లేపి ఇతడే దొంగ అని చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోతారు.
గుమ్మడి కాయలు బరువుగా వుంటాయి కాబట్టి  పల్లెల్లో వాటిని భుజాలపై మోసుకుంటూ వెళ్తారు.ఐతే మోసుకెళ్ళేటప్పుడు దానికి ఉన్న బూడిద భుజానికి అంటుకుంటుంది.కానీ అంత మాత్రాన భుజం సొట్ట పోదు కదా! తప్పు చేసిన వ్యక్తికి అలాంటి ఇంగితం వుండదు.పట్టుపడతానేమోననే భయంతో  వారి ప్రవర్తనలోనూ, హావభావాలలోనూ కనిపించే వాళ్ళ తొట్రుపాటు చర్యలను బట్టి దొంగెవరో ఇట్టే పసిగట్ట వచ్చు.
ఇదండీ "కూష్మాండ స్తేయ న్యాయము" అంటే.
దొంగతనం చేయడం మెందుకు? అలా అందరి ముందు దోషిగా నిలబడటం ఎందుకు?
తప్పుడు పనులు, దోషాలు, దొంగతనాలు చేసేవాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా పట్టు పడతారు. అలా కాకుండా సత్యం,ధర్మం, నీతి, నిజాయితీ  పాటించేవారు చాలా నిర్భయంగా, నిబ్బరంగా  వుంటారు.నీతి నియమాలు పాటించే వారు ఎవరికీ తలవంచాల్సిన, భయపడాల్సిన అవసరం లేదన్నది చిన్నప్పటి నుండే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి.
తప్పు చేయకు - పట్టుపడకు అని సత్యాన్ని  బోధించే ఈ న్యాయమును పిల్లలకు   పిల్లలకు   చిన్నప్పటి నుండే అర్థమయ్యేలా  విడమరచి చెబుదాం. నిఖార్సైన రేపటి తరాన్ని తయారు చేసుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం