నిజాయితీ పరులకే నీ ఓటు- " కావ్యసుధ " విశ్రాంత సీనియర్ జర్నలిస్ట్,9247313488 హైదరాబాద్
ఈనాటి నాయకులు
ఓటు వేసే వరకే 
నీ మాట వింటారు 
ఆపైన నీవు 
ఎవ్వరూ అంటారు ?
అమలు గాని 
హామీలను ఇస్తారు !
ఇప్పుడే...
స్వర్గలోకాన్నీ చూపిస్తారు 
ఆ తర్వాత 
బ్రతుకంతా నరకం చేస్తారు 
విజ్ఞతో ఆలోచించు...
నీకు తోడుగా ఉండే వాడిని 
నీకు నీడగా నిలిచే వాణ్ణి 
నిత్యం ప్రజా సమస్యలను
తీర్చేవాణ్ణి 
నీవు ఎన్నుకుంటే 
నీ ఓటు విలువైందే !

ఓటు పడే వరకే 
నాయకుల ఉపన్యాసాలు 
ఆపై ఐదు సంవత్సరాలు                              
మాయాబజారే !

ఈనాడు ఎన్నికల పోటీలో                               
నిలబడ్డ ఏ నాయకుడు 
కూటికి లేని వాడు కాదు 
కోట్లు ఆస్తులు

ఉన్న వారే
ఐదేళ్లలో మీ ఓటుతో 
ఆ కోట్లు వృద్ధి చెందుతాయి 
నీవు మాత్రం బక్క చిక్కిన                            
ఎముకల గూడువే !?
ఓటరన్నా నిజాన్ని గ్రహించు 
నిజాయితీపరున్ని గెలిపించు.

కామెంట్‌లు