మన తిరుపతి వెంకన్న;- ఏ.బి అనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 దేవస్థానంలో రాత్రి పగలు కూడా అందరూ ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి కూడా ప్రసాదం  భోజనమునకు ఇచ్చేవారు మైసూర్ గవర్నమెంట్ వారి సత్రంలో బ్రాహ్మణులకు మధ్యాహ్నం ఒక పూట భోజనం ఇస్తారు  భోజనం ఇచ్చే బ్రాహ్మణ హోటల్ ఒకటి ఉన్నది అక్కడ కాఫీ హోటల్స్ మాత్రం చాలా ఉన్నాయి  అందులో ఒకటి కొచ్చి సారస్వత బ్రాహ్మణులకు  ఇవేకాక ధర్మార్థముగా బసలు ఇచ్చు చిన్న ఇండ్లు ఉన్నాయి బాడుగలకు కూడా దొరుకుతాయి  దేవస్థానము యొక్క పడికావళి అనెడు సింహద్వారపు తలుపులు ప్రాతః కాలమున హరికలువను మంగళవాద్యమైన పిదప తెరువబడి అర్చకుడు లోపలికి వెళ్ళనివ్వరు అంటే లోపల చదవడం శుద్ధి చేయడం ఒక మొదలగు పనులు అయ్యేంతవరకు అని అర్థం  ఉదయం 6-7 గంటలకు దేవస్థానపు గర్భలయం యొక్క బంగారు వాకిలి అనే మొదటి ద్వారాపు తలుపులు తీస్తారు. అర్చకులు వచ్చిన తర్వాత అందరికీ ఆ విషయం తెలియడం కోసం ఒక గంట వాయిస్తారు  దేవస్థానము యొక్క పారుపత్యధార్ ఉత్తర ప్రాకారం బంగారు వాకిలి తలుపులు తీసిన వెంటనే గొల్ల అర్చకులు జి ఎం ఆర్ లు లోపలికి వెళ్లి తడుపును మూసుకొని శయనమునకు విజయం చేసిన శ్రీవారిని ఆశీర్వదిగా చేసి అతీరాంజీ మఠము వారి తెచ్చిన దారోస్టాము పాలు ఆరగింపు చేసి తలుపులు తిరిగి తీస్తారు  అంతవరకు లోపల అర్చకుడు జిఎంఆర్ లు బయట ఇతర కైంకర్య పనులను సుప్రభాతం అనే మంగళ శ్లోకములను చెబుతూ ఉంటాడు  తరువాత తలుపులు తీసిన  తరువాత  లోపలకు వెళ్లి సుప్రభాతం చెప్పుతూ ఉండగా సలాచార ప్రకారం కైంకర్యపరులు తీర్థప్రసాదమును స్వీకరిస్తారు  మంచము పరుపు మొదలగు  సామానులు  బయటకు తీసుకొస్తారు. ఈ లోపల కైంకర్యపరులు తప్ప ఇతర బ్రాహ్మణులను సహా  వదులుట దుర్లభము స్త్రీలు మొదలగు వారి మాట చెప్పనక్కర్లేదు అనంతరం విశ్వరూప దర్శనమనే ధర్మదర్శన ప్రారంభం  కాగా విశేష ద్రవ్యము శ్రీవారికి చెల్లించిన వారు మొదలగు కొందరిని ముందుగా గేటు ద్వారా వదిలి దర్శనం అయిన తర్వాత  ఒక్కొక్కసారి కొంతమంది వంతున ఒకసారి దర్శనానికి ఇతరులను  గంటల గేట్ ద్వారా వదులుతారు గేటు గుండా దేవస్థానం ఉద్యోగస్తులు  ఉత్తరువు లేకుండా అక్కడ ఉన్న మహారాజవాన్ లోపలకు వదలడు  ఈ సంగతి గమనించక కొందరు అర్చకులతో జవాన్ తో పోట్లాడతారు కూడా  ఈ ప్రకారం ప్రతిసారి దర్శనానికి ఆనుకునే ఉన్న యాత్రికులకు శ్రీవారి దర్శనం అవుతుంది  యాత్రికులు రోజు కొందరు సిఫార్సు జాబులవారు పంచదార మొదలగు తిరుమల వాసులకు    తెస్తారు.



కామెంట్‌లు