మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఇక్కడ రథము కొయ్యతో చేయబడింది శ్రీవారి బ్రహ్మోత్సవంలో ఇది చక్కగా అలంకరించబడి ఎనిమిదవ రోజున ఉదయం శ్రీవారు  విజయం చేయగా 4 వీధులు మనుషుల వల్ల లాగబడి తిరిగి యధా స్థానమునకు  చేర్చబడుతుంది. తేరుకు చేరి ఒక రాతి మండపం ఉంది  తేరు మీదకి వెళ్లడానికి ముందు శ్రీవార్లు మండపంలో విచ్చేస్తారు  దివాణం తేరుకు సమీపాన ఒక చిన్న కట్టడం ఇది యాత్రికులకు తగినంత కారణం మీద బసగా ఇస్తారు. తేరుకు సమీపంలో ఇది ఒక దేవస్థానపు కట్టడం వాహన మండపం ఇది ఒక రాతి మండపం శ్రీవారు వాహనాలు   అధిష్టించడానికి ముందు  వాహనాన్ని అక్కడ ఉంచుతారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహనానికి ముందు లాగబడే బ్రహ్మరథం ఈ మండపంలో ఉంటుంది.
గుడి ముందు కొన్ని అంగళ్ళు ఉండేవి యాత్రికులకు వంట సామాగ్రి అమ్మే వారు దానినే బజారు అనేవారు  శ్రీవారి మహాద్వారానికి రెండు ప్రక్కల ఎదురెదురుగా అంగళ్లు ఉంటాయి. ఇక్కడ బియ్యం కూరగాయలు వంటచెరుకు మొదలగు సామాన్లు  దొరుకుతాయి బియ్యము మొదలగు సామాన్లు కొనేటువంటి యాత్రికులు 
పాత్ర సామాను కూడా బాడుగకు తీసుకుంటారు. తీర్థ కట్ట సందు గుడికి వెనక ప్రాకారాన్ని ఆనుకొని సన్నని సందు ఉండేది దాని వెంబడిపోతే  ఉత్తరం వైపు కోనేటికి దారి తీసేది అందువల్ల తీర్థకట్ట వీధి అనేవారు  శ్రీవారి దేవస్థానపు ఉత్తర ప్రాకార మానుకొని తీర్థగట్టునందు  అను పేరా రాజ బాట ఉన్నది  ఇది పశ్చిమ వీధిలో శంకరమఠం వద్ద పశ్చిమ ప్రకారం ఆనుకొని దక్షిణ వీధిలో ఉంది. ఈ సందులో పురోహితుల ఇల్లు ఉంటాయి అది శ్రీవారి  పుష్కరిణి గట్టును ఆనుకొని  ఉన్న సందు గనక తీర్థగట్టు నందు అను పేరు  వచ్చింది గోసాయి మండపం మొదట ఇది ఉంది  శ్రీ హత్తి రాంజీ మఠం యొక్క మంచి కట్టడాలు కూడా అక్కడ ఉన్నాయి  శ్రీ వరాహ స్వామి వారి దేవస్థానం  ముందు ఈ స్వామి దర్శనం చేసుకుని తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అన్నది సప్రదాయం. పూజా పునస్కారాలు నిత్య నైవేద్యాలు ముందు ఈయనకే సమర్పిస్తారు. ఈయన తన అధికారాలను కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి అప్పగించాడు అని అంటారు. ఇది వాహన మండపం ఆనుకొని ఇందులో ఒక గంట ఉంది ఉదయం మధ్యాహ్నం అర్చకులు గుడికి వచ్చినప్పుడు అందరికీ తెలియజేసేటట్లుగా ఆ గంటను కొడతారు.


కామెంట్‌లు