ప్రకృతాంబ, పరిపూర్ణయాచార్యుల వరప్రసాదిగాకాశీవిశ్వేశ్వరానుగ్రహంచేసరస్వతీ నదీ తీరానకార్తీక శుద్ధ ద్వాదశి నాడుజన్మించిన మహానీయులువీరబ్రహ్మేంద్రస్వామి.కంది మల్లయ్య గ్రామంలోపశువుల కాపరి నుంచి పరమాత్మతత్వంను వివరించిన సిద్ధపురుషులు.పితృదేవుని నిర్యాణం తోమాతృమూర్తి ఆధ్యాత్మిక ఉపదేశంతోధ్యానయోగం ద్వారా ఆత్మ పరమాత్మల గురించికులమత బేధాలు చూపకజగతిన ఉన్న ప్రజలంతా పరమేశ్వర ప్రతిరూపాలనిఆనాడే సహ పంక్తి భోజనాలను ఏర్పరిచిన సంఘ సంస్కర్త.వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంరాబోయే సంఘటనలకు ప్రామాణికంబ్రహ్మం గారి మహిమను పరీక్ష దలచిమాంసాహార విందుని ఏర్పాటు చేసిన నవాబుకుయోగసిద్ధితో పుష్మములు గా మార్చుట చూసి డెబ్బది ఎకరాలను దానం చేసెనువైవాహిక జీవితంలో అర్ధాంగి గోవిందమ్మ ద్వారానలుగురు బిడ్డలకు తండ్రయినబంధాలకతీతమైనది పరమాత్మ తత్వమనివిధిని ఎదురించుట సాధ్యం ఎవరికీ కాదనిఎందరో శిష్యులకు జ్ఞానబోధ చేసిరాబోయే రోజులలో జరిగే సంఘటనలనుతత్వాల ద్వారా, కాలజ్ఞానం లో తెలిపినత్రికాలజ్ఞులు వీరబ్రహ్మేంద్రస్వామి.వైశాఖ శుద్ధ దశమి నాడు జీవ సమాధిని పొందిన సిద్ధపురుషులు.వారు సదా స్మరణీయులువారి పాదపద్మములకు సమర్పిస్తున్న నా అక్షరకుసుమాలు...!!.......................
త్రికాలజ్ఞాని - వీరబ్రహ్మేంద్రస్వామి;-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్:-విశాఖపట్నం9963265762.
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి