నాన్నా!! మీరే మా ప్రత్యక్ష దైవం*;- మాడిశెట్టి రామనాథం ఫోన్ నం.9441700527వరంగల్.
 నాన్నా !*
పెదాల తడి అంటని 
నీ పిలుపులోని శబ్దోచ్ఛారణ !
అధరాల నిరాదరణను నిరసిస్తూ 
తృప్తిగా ' బాపూ ' అని పిలుచు కున్నాం
బీజ ప్రాధాన్య జన్మకారకా 
క్షేత్ర ప్రాధాన్యతను అమ్మకు అప్పచెప్పి
అమ్మ ద్వారా మమ్ము
 ప్రపంచానికి పరిచయం చేసిన
 ఓ జీవిత ప్రదాతా
పాఠశాలలో తండ్రి పేరు రాయించి 
ప్రపంచాన్ని మాకు పరిచయం చేసావు 
మా ఎదుగుదల కోసం 
నువ్వు పూర్తిగా ఒదిగి ఉండి
భుజాల కెత్తుకొని నడిచావు
వేలు పట్టి నడిపించి 
మా తప్పటడుగులకు 
చేయూతనిచ్చావు
కుటుంబానికి ఛత్ర ఛ్చాయవై
పోషనా భార కష్టాన్ని భరించిన
ఓ జీవన ప్రదాతా 
శైశవ ప్రాయంలో మమ్మల్ని పైకెత్తుకొని
గుండెల పై తన్నించు కున్నావు
ఎందుకో తెలుసా 
పెద్దయ్యాక నిన్ను గుండెలపై
 తన్నబోమనే నమ్మకంతో 
మా బ్రతుకు ఆటలో 
మమ్ము గెలిపించాలని 
బయటి లోకంలోని ఆటల్లో 
నువ్వెన్ని ఓటములు చవి చూచావో !
నువ్వు ముళ్ల బాటలో నడిచి 
మాకు పూల బాట పరిచావు 
చిరిగిన చొక్కా నువ్వు తొడుక్కొని
మాకు మంచి  ' బుష్ కోటు '  కొనిచ్చావు
నీ ఆదర్శ భావాలకు 
తగ్గట్టుగా ఎదగాలని 
ఎంతో పరితపించావు 
మాఉజ్వల భవిష్యత్తుకై 
ఎంతో తపించావు 
ఇప్పటికీ ఈ బ్రతుకు 
ఉనికిలో ఉందంటే 
నీ ఆశీర్వాద పుణ్యఫలమే
దైవం ఎలా ఉంటుందో 
తెలియదు కానీ 
మీరే మా ప్రత్యక్ష / పరోక్ష దైవం !


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం