పరమాచార్యతో భగవాన్;-
ఓమారు కంచిపరమాచార్య తిరువణ్ణామలైకి వెళ్ళినప్పుడు గిరిప్రదక్షిణ చేశారు. ఆయనతో పాటు మరో నలుగురైదుగురు ఉన్నారు. కాస్సేపటికి భగవాన్ రమణమహర్షి శిష్యులు కొందరు బిక్షపాత్రలతో ఎదురొచ్చారు. పరమాచార్యను చూసి వారు నమస్కరించారు.
మేము భగవాన్ శిష్యులం. భగవాన్ ఆశ్రమంలో ఉన్నారని చెప్పారు.
వెంటనే పరమాచార్య అలాగా అంటూ వారిని చిరునవ్వుతో ఆశీర్వదించి ముందుకు సాగారు.
రమణ మహర్షి భక్తులు ఒకింత జంకుతో నిలబడి వెళ్ళిపోయారు. రమణ మహర్షి గురించి ఆయన క్షేమసమాచారం గురించి పరమాచార్య అడగకపోవడమే కాక తమకు తెలుసన్నట్టు ఎక్కడా మాటల్లో చూపలేదు.
ఆ భక్తులు కొండెక్కి వెళ్ళి శ్రీ రమణ మహర్షికి భిక్షను ఇచ్చి దారిలో పరమాచార్యను కలిసిన విషయాన్ని చెప్పారు. అంతేకాదు, తమ బాధనూ వ్యక్తం చేశారు.
వారి మాటలు విన్న భగవాన్ ఓ చిర్నవ్వు నవ్వారు.
ఒరేయ్ మేమిద్దరం మాట్లాడేసుకున్నాం. ఇప్పుడూ మాట్లాడుకుంటున్నాం. దీనికా మీరు బాధపడుతున్నారు అని అడిగారు.
భగవాన్ భక్తులు నిర్ఘాంతపోయారు.
దీనిని అప్పుడు ప్రత్యక్షంగా చూసిన ఓ ఎనబై ఎనిమిదేళ్ళ స్త్రీ చెప్పడాన్ని ఓ ప్రముఖ రచయిత పూసగుచ్చినట్లు ఓ పుస్తకంలో రాశారు.
పరమాచార్య, భగవాన్ మహాజ్ఞానులు. తపస్సంపన్నులు. వారి మధ్య ఎప్పుడూ ఓ సంభాషణ జరుగుతూనే ఉంటుంది. పాల్ బ్రంటన్ అనే ఆయన ఓ మారు పరమాచార్య వద్దకు ఆధ్యాత్మిక విషయమై మాట్లాడటానికి వెళ్ళారు. అప్పుడు పరమాచార్య ఆయన జ్ఞాన మార్గంలో పోతున్నారు. నేను కర్మ మార్గంలో పోతున్నాను. నీ ప్రశ్నలకు జవాబివ్వగలవారు తిరువణ్ణామలైలో ఉన్నారు. ఆయనను కలుసుకో అన్నారు.
పాల్ బ్రంటన్ ఆ మేరకు రమణ మహర్షిని కలిసి తనకున్న సందేహాలన్నీ అడిగి నివృత్తి చేసుకున్నారు. ఆ క్షణం నుంచీ ఆయన భక్తుడయ్యారు. అంతేకాదు, రమణ మహర్షి గురించి ఓ పుస్తకం కూడా రాసారు. పరమాచార్యకు, భగవాన్ రమణ మహర్షికి పరస్పరం ప్రేమ లేకుంటే ఇది జరిగేనా....ఏదేమైనా పరమాచార్య, భగవాన్ మన దేశానికి లభించిన మహాభాగ్యం.
 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం