శ్రీకాకుళం జిల్లాకు చెందిన కడుము పాతపొన్నుటూరు పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు జాతీయ స్థాయిలో లేఖ పురస్కారాన్ని అందుకున్నారు. శిష్టకరణ లేఖ చీఫ్ ఎడిటర్ జన్నుమహంతి వెంకట చంద్రబాబు, లేఖ ఫౌండర్ పబ్లిషర్ శేఖరమంత్రి నరహరినాథ్ లు ప్రకటించిన జాబితాలో తిరుమలరావుకు చోటు దక్కింది. శిష్టకరణ లేఖ ఐక్యవేదిక ప్రతినిధి, ప్రముఖ సాహితీవేత్త, గాయకులు పట్నాయకుని రామకృష్ణారావు రామతాత చేతులమీదుగా తిరుమలరావు జ్ఞాపికను, పురస్కార పత్రాన్ని స్వీకరించారు. తిరుమలరావు సతీమణి
రాజాం వరలక్ష్మీ సెంటాన్స్ హైస్కూల్ హిందీ పండిట్ నడుకూరు సుకన్య పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన శిష్టకరణాలను ఈ లేఖ బిరుదాంకిత పురస్కారాలను ప్రదానం చేసేందుకై, తొలుత ప్రతిభా పాటవాలు కలిగియున్న శిష్టకరణాల వివరాలను అంతర్జాలం ద్వారా నామినేషన్ యాప్ లను ఉపయోగించి ఎంపిక చేయగా, తిరుమలరావుకు స్థానం లభించింది. సీనియర్ శిష్టకరణ న్యాయనిర్ణేతల బృందం చేపట్టిన ఎంపిక ప్రక్రియలో, తనకు స్థానం కల్గించుట పట్ల తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలరావు
లేఖ పురస్కారాన్ని పొందుట పట్ల ఆలిండియా శిష్టకరణ సంఘ అధ్యక్షులు డబ్బీరు కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర శిష్టకరణ అధ్యక్షురాలు డి.రమ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకరణ అధ్యక్షులు పోలుమహంతి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెలగాం జయబాబు, శిష్టకరణ ప్రతినిధులు పోలుమహంతి జగన్మోహనరావు, సింహగిరి పట్నాయక్, పట్నాయకుని రామకృష్ణారావు రామతాత, డా.బి.ప్రవీణ్ సాయి, శ్రీకాకుళం జిల్లా శిష్టకరణ అధ్యక్షులు డబ్బీరు వాసు, జిల్లా గౌరవాధ్యక్షులు బలివాడ మల్లేశ్వరరావు తదితరులు హర్షం వ్యక్తం చేసారు. తిరుమలరావు పదిహేనేళ్ల క్రితం జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్రపతి పురస్కారం స్వీకరించారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందిస్తూ, అదనపు సమయాల్లో నటన, దర్శకత్వం, గానం, చిత్రలేఖనం, రచన, స్వరకల్పన, నృత్య రూపకాలందు ఘనమైన కృషిచేస్తూ సత్ఫలితాలను సాధిస్తూ వందలాది పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు. రానున్న శిష్టకరణ తరాలకు ఎంతో ఆదర్శంగా నిలిచారని శ్రీకాకుళం రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ పోలుమహంతి జగన్మోహనరావు తదితరులు కొనియాడారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి