కవి, రచయిత అయ్యలసోమయాజులకు 'సాహిత్య విభూషణ' పురస్కారం

  భాగ్యనగరంలో ప్రముఖ సాహితీ సమాజ సేవా సంస్థ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా  కవి రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ రసాయన శాస్త్ర విశ్రాంత శాఖాధిపతి విశాఖపట్నం శాస్త్రీయ  మరియు సామాజికదృక్పథం తో  నిరంతరం చేస్తున్న  సాహితీ సేవను అభినందిస్తు గౌరవ సూచకంగా "సాహిత్యవిభూషణ"
బిరుదును సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ కవి రచయిత డాక్టర్ రామదూత కోటేశ్వర రావుగారు , వాల్మీకి జాతీయ సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ వి.డి. రాజగోపాల్,  కుసుమధర్మన్న కళాపీఠం  అధ్యక్షురాలు కవియత్రి డాక్టర్ రాధాకుసుమ, కవి గాయకుడు డాక్టర్ అరవా రవీంద్ర  ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ రామకృష్ణ చంద్రమౌళి గారు పాల్గొన్న అంతర్జాల వేదిక సమక్షంగా అందచేసారు.  ప్రసాద్ మాష్టారును  ఈ సందర్భంగా సాహితీమిత్రులు కుటుంబసభ్యులు అభినందనలు తెలిపారు.బదులుగా నిరంతరం సామాజిక సేవ చేసే రామదూత సాహితీ సంస్థ వారిచే శ్రీరామచంద్రుని కృపవలన లభించిన పురస్కారం జీవితాన మరువలేనిదని సంతోషం వ్యక్తం చేసారు.
.............................
కామెంట్‌లు