గుండాల నరేంద్ర బాబు కు "విశ్వావసు ఉగాది పురస్కారం

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా సాంస్కృతిక మండలి సంయుక్త నిర్వహణలో విశ్వా వసు ఉగాది వేడుకలు ఘనంగా  జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని కవిబ్రహ్మ తిక్కన భవనంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ ఓ. ఆనంద్ ఐ. ఏ. ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ బడ్డాయి. తొలుత మంగళ వాయిద్యాలతో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, జాయింట్ కలెక్టర్ కే. కార్తీక్, జిల్లా రెవిన్యూ అధికారిజే. ఉదయభాస్కర్ రావు, నెల్లూరు ఆర్డీవో అనూష, నగర మేయర్ పొట్లూరు స్రవంతి, జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్. బాలాజీ రావు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కే. సదా రావు,  శ్రీ. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల,నెల్లూరు ప్రిన్సిపాల్ శ్రీమతి జ్యోతిర్మయి తదితరులకు  వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం వేద పఠనం, పంచాంగ శ్రవణం,  సాహిత్య రంగంలో విశేష ప్రతిభ కనబరచిన పదకొండు మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించి వారిని శాలువ, జ్ఞాపిక,పుష్ప గుచ్ఛం, 1000/- నగదుతో విశ్వావసు ఉగాది పురస్కారాలు-2025ను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులు శ్రీయుతులు మోపూరు పెంచల నరసింహం, గుండాల నరేంద్ర బాబు, అవ్వారు శ్రీధర్ బాబు, తిప్పవజ్జుల నరసింహ మూర్తి, గండికోట సుధీర్ కుమార్, మాటేటి రత్న ప్రసాద్, అలెగ్జాoడర్, గోవిందరాజు సుభద్రాదేవి, పాతూరి అన్నపూర్ణ, తోట సులోచన,ములుగు లక్ష్మీ మైధిలి. పంచాంగ శ్రవణం ఆలూరి శిరోమణి శర్మ నిర్వహించారు. కవి సమ్మేళనం ఆహుతులను అలరించింది. సభకు హాజరైన వారికి ఉగాది పచ్చడి, స్వీట్ బాక్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు సాహిత్యాభిమానులు  పాల్గొన్నారు.
గుండాల నరేంద్ర బాబు  1991 నుంచి కవితలు రాస్తున్నారు. జవహర్ భారతి కళాశాల, కావలిలో చదివే రోజుల్లో కళాశాల సంచిక కోసం మొదటి సారిగా రాసిన   "జీవితం" అనే కవిత  కళాశాల సంచికలో ముద్రించబడింది. అప్పటి నుంచి వీరు రాసిన పలు కవితలు ఆంధ్ర జ్యోతి, ఈనాడు, వార్త, సూర్య, వార్త,ఆంధ్ర భూమి, ప్రజా శక్తి, విశాలాంధ్ర,సాక్షి, ఆంధ్ర ప్రభ, పున్నమి, కోస్తా ప్రభ,తెలుగు లోకం, వార్తాప్రభ,భూమి పుత్ర,నవ తెలంగాణ తదితర దిన పత్రికలు,జమీన్ రైతు, లాయర్, ఆంధ్ర భూమి,ప్రజా తంత్ర, సామూహిక వంటి వారపత్రికలు, నేటి నిజం, ప్రసారిక, చిన్నారి నేస్తం వంటి మాస పత్రికల్లో వీరి కవితలు,  ప్రచురించబడి పాఠకుల మన్ననలందుకున్నవి. సాక్షి ఫండే ఆదివారం సంచిక, వార్త ఆదివారం అనుబంధం, మొలక బాల సాహిత్య పత్రిక ల్లో వీరు చిన్నారుల కొరకు రచించిన బాల గేయాలు ప్రముఖంగా ప్రచురించబడి పలువురు బాలసాహితీ వేత్తల అభినందనలు అందుకున్నవి. 'తెలుగు ప్రభ' దిన పత్రిక నందు వీరి బాలగేయాలు గురించి ప్రముఖ బాల సాహితీ వేత్త, బాలల కథా రచయిత, పైడిమర్రి రామకృష్ణ ఇటీవల ప్రముఖంగా రాస్తున్న ప్రముఖ బాల గేయాల రచయిత గుండాల నరేంద్ర బాబు గురించి ఒక ప్రత్యేక కథనం రాయడం బాల గేయాలు రాయడం వీరికున్న ప్రతిభకు నిదర్శనం.
ఇప్పటి వరకు వీరు 700 బాల గేయాలు, పలు సామాజిక అంశాలపై1000 గీతాలు రాశారు. పలు సామాజిక గీతాలు, కవితలు ఆకాశ వాణి,విజయవాడ, నెల్లూరు కేంద్రాల్లో ప్రసారం చేయబడి శ్రోతల మన్ననలు పొందాయి.
తెలుగు ఉపాధ్యాయునిగా ప్రస్తుతం కే ఎన్ ఆర్. మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్ బి. వి. నగర్, నెల్లూరు నందు తెలుగు భాష బోధిస్తూ  విద్యార్థుల్లో తెలుగు  భాష యెడల అభిమానాన్ని ఆసక్తిని, అనురక్తిని, అభిరుచిని కగిలిస్తూ,కవిగా, రచయితగా, బాల సాహితీ వేత్తగా వ్యాఖ్యాతగా పలు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు.
 రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయునిగా ముఖ్యమంత్రిచే పురస్కారం- 2022 అందుకుని, పలు సామాజిక సేవా కార్యక్రమాలతో విశిష్ట సేవలు అందిస్తూ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల ఎన్ సి సి డైరెక్టరేట్ స్థాయిలో హైదరాబాద్ నందు ఉత్తమ ఎన్ సి సి ఆఫీసర్  అవార్డు- 2024-25 డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్ సి సి అధికారి నుంచి అందుకున్న గుండాల నరేంద్ర బాబు సాహిత్య రంగంలో చేస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా  ఆదివారం నిర్వహించిన  విశ్వా వసు ఉగాది వేడుకల్లో
  శ్రీ  పొట్టి శ్రీరాములు  నెల్లూరు జిల్లా కలెక్టర్  & మేజిస్ట్రేట్ శ్రీ  ఓ. ఆనంద్ I.A.S గారి నుంచి "విశ్వా వసు ఉగాది పురస్కారం-2025"తో ఘన సత్కారం అందుకున్నారు. ఈసందర్భంగా గుండాల నరేంద్ర బాబును పలువురు సాహితీ వేత్తలు, ఉపాధ్యాయులు అభినందించారు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం
ఏం కాలం? ఇది పోయే కాలం!:- యలమర్తి అనూరాధ
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం