ఇళ్ళకు వెళ్ళి నూతన ప్రవేశాలు- ఒకటో తరగతిలో నమోదులు

 బడీడు పిల్లలను బడిలో చేర్పించే ప్రక్రియలో భాగంగా, ఇళ్లకు వెళ్లి నూతన నమోదులు గావించుచున్నామని
పాతపొన్నుటూరు ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు తెలిపారు.
స్థానిక అంగన్వాడీ కేంద్రంలో గల పిల్లలలో ఐదేళ్లు నిండిన వారి వివరాలను అంగన్వాడీ కార్యకర్త పతివాడ కాంచనమాల నుండి సేకరించడం కూడా జరిగిందని ఆయన అన్నారు. 2025 ఆగష్టు 31 నాటికి ఐదేళ్లు పూర్తి కాగల్గు బాలబాలికలను పదిమందికి పైగా సేకరించడం జరిగిందని కృష్ణారావు తెలిపారు. పాతపొన్నుటూరు పాత ఊరు, పాతపొన్నుటూరు కోలనీలలో గల వారి ఇళ్ళ వద్దకే ప్రవేశ దరఖాస్తులను తీసుకుని వెళ్ళినట్లు ఆయన తెలిపారు. దరఖాస్తును పూరించిన తల్లిదండ్రులు బండ్ల సింహాచలం హేమలత, టెక్కలి ధనంజయరావు ఝాన్సీ, బెహరా జగన్నాధం లక్ష్మి, పిల్లల షణ్ముఖరావు పద్మ, టెక్కలి రవికుమార్ తేజేశ్వరి, భక్తల భుజంగరావు లావణ్య దంపతులు 
తమ బిడ్డలైన బండ్ల ప్రతీక్షాప్రియ, టెక్కలి అభిరామ్, బెహరా గణేష్, పిల్లల చాందిని, టెక్కలి అక్షయ, భక్తల వర్ణితలను బడిలో జాయిన్ చేస్తూ సంతకాలు చేసి తమకు అందజేసారని ఆయన తెలిపారు. నేటి ఈ పర్యటనలో ఆరుగురు బాలబాలికలు ఒకటో తరగతిలో నమోదైనట్లు కృష్ణారావు తెలిపారు.
ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావుతో పాటు ఉపాధ్యాయులు అందవరపు రాజేష్, పైసక్కి చంద్రశేఖరం, బూడిద సంతోష్ కుమార్, యిసై సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావు, కుదమ తిరుమలరావులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.
కామెంట్‌లు