కల్తీ ఆహారంలో మన తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. కల్తీ ఆహారం తినడం వల్ల వలన వేలాది మంది అనారోగ్యం పాలవుతున్నారు. మానవాళికే ప్రమాదకరంగా మారిన ఈ కల్తీని సమర్థవంతంగా నిరోధించి, కల్తీసురుల ఆటకట్టించే చట్టాలే కరువయ్యాయి.నేషనల్ క్రైమ్స్ బ్యూరో ఇటీవల 19 నగరాల్లో ఆహార నాణ్యతపై తనిఖీలు చేయగా హైదరాబాద్ దేశంలోనే 246 కేసులతో అగ్రస్థానంలో నిలిచిందని, ఇది దేశ వ్యాప్త కేసుల్లో 84 శాతమని బ్యూరో గణాంకాలతో సహా ప్రకటించడం ఆరోగ్యరంగ నిపుణులను ఆందోళనపరుస్తోంది.అత్యధిక జనసాంద్రత, వేలాది హోటళ్ళున్న హైదరాబాద్లో ఆహార కల్తీని నిరోధించే అధికారులు కేవలం 30 మంది మాత్రమే ఉన్నారంటే నియంత్రణ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గల్లీ హోటల్స్, చిరు వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లలోనూ ఈ కల్తీ దందా నడుస్తోంది. దీంతో ఆహార భద్రతా ప్రమాణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
తమ వ్యాపారం పెంచుకునేందుకు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. దీంతో వారి వ్యాపారమే కాదు, ఆస్పత్రులు కూడా నిండిపోతున్నాయి. టీ, కాఫీ, పాలు, పిండి, నూనెలు, మాంసం, కంది పప్పు, మిరియాలు, జీలకర్ర, బియ్యం ఇలా నిత్యం వినియోగించుకునే అన్ని పదార్థాలూ కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టుంది పరిస్థితి. కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు సరుకులు కల్తీ చేస్తుండడం, వినియోగదారుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తీస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పర్యవేక్షణ పెరగాలి. ఆహార భద్రత, పరిరక్షణ, ప్రమాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. దీనికి ప్రత్యేకంగా ప్రభుత్వం ఆహార భద్రత, ప్రమాణాల అధికారులను (ఫుడ్ ఇన్స్పెక్టర్ల) నియమించాలి. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్ల నియమాకాలను గత కొంత కాలంగా చేపట్టటం లేదు. కార్యాలయ నిర్వహణకు సిబ్బంది లేరు
తమ వ్యాపారం పెంచుకునేందుకు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. దీంతో వారి వ్యాపారమే కాదు, ఆస్పత్రులు కూడా నిండిపోతున్నాయి. టీ, కాఫీ, పాలు, పిండి, నూనెలు, మాంసం, కంది పప్పు, మిరియాలు, జీలకర్ర, బియ్యం ఇలా నిత్యం వినియోగించుకునే అన్ని పదార్థాలూ కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టుంది పరిస్థితి. కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు సరుకులు కల్తీ చేస్తుండడం, వినియోగదారుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తీస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పర్యవేక్షణ పెరగాలి. ఆహార భద్రత, పరిరక్షణ, ప్రమాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. దీనికి ప్రత్యేకంగా ప్రభుత్వం ఆహార భద్రత, ప్రమాణాల అధికారులను (ఫుడ్ ఇన్స్పెక్టర్ల) నియమించాలి. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్ల నియమాకాలను గత కొంత కాలంగా చేపట్టటం లేదు. కార్యాలయ నిర్వహణకు సిబ్బంది లేరు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి