అంతరిస్తున్న పగడపు దిబ్బలు.:- తాటి కోల పద్మావతి

 రానున్న 25 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పగడపు దిబ్బలన్నీ కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని అమెరికా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనాల్లో తేలింది. సముద్ర ఉష్ణోగ్రత పెరగటం అల్గేలు ఇతర విష రసాయనాలు కారణంగా ఇవాళ బిత్తి కలు మనగలగా లేక పోతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ పగడపు దిబ్బలలో 60 శాతం మాత్రమే సజీవంగా ఉన్నాయని రానున్న 20 ఏళ్లలో అవి కూడా అంతరించి చనిపోతాయని విర్జిన్ ఐలాండ్స్ యూనివర్సిటీ పరిశోధకులు టైలర్ స్మిత్ వివరిస్తున్నారు. ఈ ప్రవాళ భిత్తికలు సంఖ్య అనేకమైన సముద్రపు మొక్కలు ఇది జంతువులకు ఆదిత్యం ఇస్తుంటాయి. ఈ బిత్తికలు అంతరించడం అంటే ఆ జంతువులను, మొక్కలు కూడా కోల్పోవడమే అవుతుంది. సముద్రం ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే పెంచడం వల్ల వ్యాధులు సంభవించి జీవాన్ని కోల్పోయినట్లు విర్జిన్ ఐలాండ్స్ పరిసరాలలోని సముద్ర జలాల అడుగునున్నటువంటి దిబ్బలు 40 శాతం మేరకు 2005 సంవత్సరంలోనే నిర్జీవమయ్యాయని జఫ్ మిల్లర్ అనే శాస్త్రవేత్త తన పరిశోధనలో స్పష్టం చేశారు. ఇదంతా మానవ స్వయంకృతాపరాధమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ప్రమాదంలో పడుతున్న వాస్తవాన్ని శాస్త్రవేత్తలు నొక్కి వక్కాణిస్తున్నారు. ప్రాచీనులు ఈ పగడపు దిబ్బలను ప్రవాళ లతాలు అనగా తీగల అని పేర్కొన్నారు. 

కామెంట్‌లు