ఉగ్రవాదులపై ఉక్కుపాదం..?( కుక్క కాటుకు చెప్పు దెబ్బ ): - కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ -పోలయ్య కూకట్లపల్లి -అత్తాపూర్ హైదరాబాద్

కవితపై చిరువ్యాఖ్య:
(ఉగ్రవాదం మానవతా విలువలకు 
విరుద్ధంగా, అమాయకుల ప్రాణాలను బలితీసుకునే హింసాత్మక నిశాచర పిశాచ పైశాచికత్వం. కాశ్మీర్ లో అమాయకపు పర్యాటకులపై జరిగిన ఈ దారుణమైన దాడి జరిపిన మారణకాండ మన హృదయాలను గాయం చేసింది. ఈ కవిత, శోకం కంటే కోపాన్ని, భయానికి బదులుగా ప్రతీకారాన్ని వ్యక్తపరుస్తుంది. శాంతిని కోరే మన దేశం అవసరమైతే ఉక్కుపాదాన్ని కూడా 
మోపగలదన్న సంకల్పానికి ప్రతిరూపం)

పార్టు...1
పాకిస్తాన్ పాపాల పుట్ట 
పాకిస్తాన్ అబద్ధాల అడ్డా
నాడు భారత్ తో యుద్దానికి 
కాలు దువ్వింది పాక్ 
కొట్టింది కార్గిల్ కొండల్లో కరెంట్ షాక్ 
కానీ పాపిష్టి పాక్ కి బుద్ది రాలేదు 
గుణపాఠాలేమీ నేర్చుకోలేదు
 
ఉగ్రవాద విషసర్పాలకు పాలుపోసి పెంచి 
చాటు మాటుగా భారత్ లోకి పంపుతుంది
అమాయకపు అహింసా భారత్ 
శాంతికపోతాలను కాటు వేయమని...

కాశ్మీర్ లో పహల్గామ్ లో 
అందాల బైసరిన్ లోయలో 
ఆనంద సాగరంలో మునిగితేలే 
26 మంది అమాయకపు 
టూరిస్ట్ లను పొట్టన పెట్టుకోమని...

చంప్పొద్దని చేతులెత్తి వేడుకుంటున్నా
కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడినా 
కనికరం లేదాయె ఆ కసాయిమూకలకు... 

అతి దగ్గరగా అదీ 
"కల్మా" చదవమని..."మతం" పేరడిగి...
ఒక వేటగాడు జింకల్ని వేటాడినట్లు...
ఒక కసాయివాడు పిట్టల్ని కాల్చినట్టు...
భార్యల కళ్ళముందే తమ భర్తలను... 
పిల్దల కళ్ళముందే తమ తండ్రులను... 
నిర్దాక్షిణ్యంగా తుపాకులతో కాల్చి చంపి 
పచ్చని బైసరిన్ మైదానంలో 
రక్తపాతాన్ని...మారణహోమాన్ని 
సృష్టించారు...ఉన్మాదులైన ఉగ్రవాదులు 

పార్టు...2
పర్యాటకులంతా రక్తపు మడుగులో 
కొనఊపిరితో గిలగిలా కొట్టుకునే వేళ 
రాక్షసానందం పొందిన...
ఓ రాక్షసులారా...
ఓ రక్తం త్రాగే రాబందులారా...
ఓ పాకిస్తాన్ ఉగ్రవాద పిచ్చి కుక్కల్లారా...
కాశ్మీర్ అడవుల్లో దాగిన గుంట నక్కల్లారా
ఓ పాక్ తొత్తుల్లారా...నయవంచకులారా...
ఓ పాపం పుణ్యంలేని పిశాచుల్లారా... 
ఓ ముష్కరులారా...మూర్కులారా...

మీరు మీ మద్దతుదారులు 
పాతాళంలో నక్కినా మీ గుండెల్లో 
మరఫిరంగులు పేల్చేందుకు... 
మిమ్మల్ని మట్టుపెట్టెందుకు...
మా వీర సైనికులు సిద్దంగా ఉన్నారు...మా
యుద్ధవిమానాల్తో మీ భూమి దద్దరిల్లాలి
ఈ భూమిపై మీకు బ్రతికే హక్కు లేదు 
మీరు భారీమూల్యం చెల్లించుకోక తప్పదు
  
అందుకే ఎక్కడైతే అమాయకపు 
భారతీయ బిడ్డల రక్తం ఏరులై పారిందో...
ఎక్కడైతే వారు రక్తపుమడుగుల్లో పడి 
గిలగిలా కొట్టుకున్నారో... 
ఎక్కడైతే భార్యాబిడ్డలు 
ఉగ్రమూకల భీకర కాల్పులకు... 
భయంతో గజగజా వణికిపోయారో
ఆదుకోమని ఆర్తనాదాలు చేశారో... 
ప్రాణభయంతో పరుగులు పెట్టారో

అక్కడే ఉన్మాదులైన ఉగ్రవాదుల
తలలు తెగ నరికి వ్రేలాడ దియ్యాలి
పర్యాటకుల సందర్శనార్థముంచాలి
అందాల బైసరిన్ లోయలో వారికి 
అంతిమ సంస్కారం జరగాలి... 

పార్టు...3
అందుకే ప్రభుత్వమిక 
మీనమేషాలు లెక్కించక
ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలి
పహల్గామ్ లో ఉగ్రదాడికి పాల్పడి
దారుణ మారణ కాండను...జరిపి
"ఇక యుద్ధానికి మేం సిద్ధమని"
"సింధూనదిలో "పారేది నీరు కాదని"
"భారతీయుల రక్తమని" 
ప్రగల్భాలు పలికే పాక్ పై 
భారత్ సైనికులు ప్రతీకారం తీర్చుకోవాలి.

అప్పుడే అక్కడ అసువులు బాసిన 
ఆ టూరిస్టుల...ఆత్మలకు శాంతి...
అప్పుడే పగతో...కోపంతో... 
ప్రతీకారంతో...రగిలిపోయే 140 
కోట్లమంది భారతీయుల...కళ్ళల్లో కాంతి.

పాక్ ను ప్రపంచంలో ఏకాకిని చేసి 
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపి...
పాక్ ను పాతాళానికి అణగద్రొక్కమంది...  
నా తల్లి భారతి... 
అందుకు అందుకోనుంది 
అగ్రరాజ్యాల ప్రశంసల మంగళ హారతి...

జై హింద్ జై హింద్...జై భారత్ జై భారత్


కామెంట్‌లు