పరీక్ష(నానో కథ );- ఎం. వి. ఉమాదేవి.
 ఇంట్లో బోలెడు పనులు రాజేశ్వరికి.అవన్నీ చూసుకుంటా ఉంటే, కాలిమీద కుక్కర్ మూతపడి నొప్పిచేసింది. తల వంచుకొని పాదానికి మందురాసుకుంటూ ఉంటే, సందట్లో సడేమియాగా మనవడు వాటర్ బాటిల్ మూతతీసి బియ్యం బస్తాలో పొసేడు. వెనక్కి చూస్తే చేతులు పెట్టి బియ్యం కలుపుతున్నాడు.
పట్టరాని కోపంతో రెండు వాయించి, కుంటుకుంటూనే ఉసూరుమంటూ బియ్యం ఆరబోసింది.
కథల్లో భగవంతుడు పరీక్షలు పెడుతున్నాడు అని చదివి ఆఁహాఁ అని ఆస్వాదన చేస్తాం. నిజజీవితం లో చిన్న చిన్నవే తట్టుకోలేo ఏమిటో!? అనుకుంటూ,ఆకలి అని వచ్చిన మనవడికి పప్పు నెయ్యి కలిపి ఇష్టంగా తినిపించింది!

కామెంట్‌లు