సునంద భాష్యం :- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు-867
"చతుర్వేద విత్ న్యాయము
****
చతుర్వేద అనగా నాలుగు వేదాలు. విత్ అనగా తెలిసిన,తెలిసినది.చతుర్వేద విత్ అనగా నాలుగు వేదాల జ్ఞానం కలిగి ఉండటం లేదా నాలుగు వేదాల గురించి తెలుసుకోవడం అనే అర్థాలు ఉన్నాయి.
గోవులు, బంగారం మొదలైన ధనమును చతుర్వేదములను తెలుసుకొన్న వానికి దానం చేయవలెను అనే మాటను ఒకడు విని అతడొక ధనవంతుడి వద్దకు వెళ్ళి" వేదములు నాలుగు ఉన్నాయని నాకు తెలుసు.కాబట్టి నాకు దానము ఇమ్ము "అని అడిగినాడట.వానిని చూసి నవ్వి ఆ ధనవంతుడు వెళ్ళగొట్టినాడట.
అట్లే "బ్రహ్మ సచ్చిదానంద స్వరూపుడు అభిన్నుడు "అనే వాక్యమును మాత్రమే తెలుసుకొని"నేను బ్రహ్మమును తెలుసుకొన్నాను" అని చెప్పడము హాస్యాస్పదం అవుతుంది.అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 పై రెండు రకాలైన ఉదాహరణలను గమనించినప్పుడు మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మిడిమిడి జ్ఞానం గల వ్యక్తి ఎప్పుడూ, ఎవరు కూడా మొత్తం జ్ఞానవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందడు అని భావము.
విషయంలోకి వెళ్ళే ముందు ఈ చతుర్వేదాల గురించి రేఖామాత్రంగా తెలుసుకుందాం. హిందూ మతములో వేదాలను అత్యంత ప్రామాణికమైన సాహిత్యంగా భావిస్తారు.వీటిని శ్రుతులు అంటారు. ఇక విత్ లేదా విద్ అనే ధాతువుకు తెలియుట అని అర్థము. ఇలా చతుర్విధ విత్ అనగా వేదములు వేదములు భగవంతుని ద్వారా తెలుపబడినవి అని ఆధ్యాత్మిక వేత్తల నమ్మకం.అందుకే వేదాలను అపౌరుషేయాలు అని కూడా అంటారు.
 మిడి మిడి జ్ఞానం కలిగిన ఓ వ్యక్తి అన్నీ తెలుసు అన్నట్లుగా ధనాశతో  ధనవంతుడి వద్దకు వెళ్ళి దానం కావాలని అడిగితే.. అతడి మాట తీరును బట్టే ధనవంతుడికి అర్థమై వుంటుంది. అందుకే ఆ వ్యక్తిని చూసి నవ్వి వెళ్ళమన్నాడు.
ఇలాంటి మిడి మిడి జ్ఞానం కలిగిన వారి గురించిన ఓ మంచి శ్లోకాన్ని చూద్దాం.
అజ్ఞఃసుఖమారాధ్యఃసుఖతరమారాధ్యతే విశేషజ్ఞః!/జ్ఞానలవ దుర్వి దగ్ధం బ్రహ్మ పితం నరం నరం జయతి!!
అనగా తెలియని వానికి తేలికగా చెప్పవచ్చు ( తెలియదు కాబట్టి) తెలిసిన వానికి ఇంకా తేలికగా చెప్పవచ్చు.(ఎందుకంటే చెప్పే విషయం మీద అవగాహన ఉంటుంది కనుక)తెలిసి తెలియని వారికి బ్రహ్మ కూడా చెప్పలేడు.కారణం ఏమిటంటే మిడి మిడి జ్ఞానంతో నాకంతా తెలుసు అనే భావంలో ఉంటాడు.అందువల్ల అలాంటి వారికి ఎవరూ చెప్పలేరు. ఇదిగో ఇలా ధనవంతుడిలా నవ్వి పంపించడం తప్ప.
 అందుకే  తెలిసి తెలియని వాళ్ళను ఎలా ఒప్పించాలో, మెప్పించాలో తెలియదు అంటుంటారు.అతడు డబ్బాశకు వెళ్ళి భంగపడ్డాడు..
ఇక రెండో విషయం కూడా అదే తంతు.కేవలం బ్రహ్మ సచ్చిదానంద స్వరూపుడు,అభిన్నుడు అనే వాక్యాన్ని  పట్టుకొని లోతుల్లోకి వెళ్ళకుండా అంతా తెలుసు అని భావించడం తప్పు కదా! అందుకే అతడి ప్రవర్తనను అందరూ తప్పు బట్టడం జరిగింది.
 పై రెండు ఉదాహరణలు వల్ల మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఏదీ సంపూర్ణంగా అధ్యయనం చేయకుండా, పూర్తి అవగాహన పొందకుండా జ్ఞానిగా చెప్పుకోవడం హాస్యాస్పదం.
 ప్రతి విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేయాలని , మిడి మిడి జ్ఞానం ఎప్పుడూ అభాసుపాలు కాక తప్పదు అని చెప్పడమే ఈ "చతుర్వేద విత్ న్యాయము లోని అంతరార్థము.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం