ట్రాఫిక్ లో క్రమశిక్షణ: - యామిజాల జగదీశ్
 970లలో దక్షిణ కొరియాలో, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలను నడిపే వారిని వినూత్న రీతిలో శిక్షించేవారు. ట్రాఫిక్ విభాగం గుర్తించిన వరుసలోనే వాహనాలను నడిపించుకుని పోవాలి. అలా కాదని ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే పోలీసులు వారిని పట్టుకుని ఒక ప్రత్యేకమైన శిక్షా పద్ధతిని అమలు చేసారు. 
నిబంధనలను ఉల్లంఘించిన  వ్యక్తులను "పబ్లిక్ బాక్స్" అనే దాంట్లో నిలబెట్టే వారు. దాదాపు 30 నిమిషాలు తక్కువ కాకుండా ఆ బాక్సులో నిలబడాలి. వారిని చూడటంతోనే ఎవరైనా గుర్తించవచ్చు వారు ట్రాఫిక్ నిబంధనల గీత దాటారని. 
ట్రాఫిక్‌లో క్రమశిక్షణను పెంచే ప్రయత్నంలో భాగంగా ట్రాఫిక్ రూల్సుని పాటించడంలోని ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచే ప్రయత్నంలో భాగమే ఈ శిక్ష.
ఇటువంటి చర్యలు రోడ్డు భద్రతను మెరుగుపరచడంతోపాటు ప్రమాదాల సంఖ్యను తగ్గించడం లక్ష్యంగా చేసుకునే ఈ విధానాన్ని పాటించినట్లు పోలీసు విభాగం పేర్కొనేది. ఈ శిక్షా విధానంతో ఊహించిన దాని కన్నా సత్ఫలితాలను పొందామని  తెలిపింది.
దేశంలో వేగవంతమైన పట్టణ వృద్ధి, ఆధునీకరణ సమయంలో ట్రాఫిక్ నిబంధనలను పాటించడం అనేది చాలా ముఖ్యమైన అంశమేగా. నిజానికి ఎవరికి వారు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే ఎంతో బాగుంటుంది.

కామెంట్‌లు