మనం ఓ కప్పు కాఫీని
విడవలేం
స్వీట్ అని రాస్తున్నప్పుడే
నోరూరుతుంది
రెండు పదులనే వయస్సు
అనుభవించే వయస్సు
ఇకమీదట అమ్మ చేతివంట
తినడం కుదరదు
నాన్న భుజం మీద
చెయ్యి వేయడం కుదరదు
చెల్లితో ఆటలు కుదరవు
గొడవా పడటమూ కుదరదు
సమవయస్కులైన
స్నేహితులతో క్రికెట్
ఆడటం కుదరదు
సమీపబంధువుతో
నవ్వుతూ కాలక్షేపంగా
ముచ్చట్లాడటం కుదరదు
ఇష్టమైనదంటూ
భుజించడం కుదరదు
ఎప్పుడంటే అప్పుడు
నిద్రపోవడం కుదరదు
నొప్పినీ
బాధనూ
బయటకు వెల్లడించటమూ
తగదు
అనుకున్నప్పుడల్లా
అమ్మను
చూడటం కుదరదు
ఇరవై నాలుగ్గంటలూ
దైవ చింతనా, లోకక్షేమమే
ఎటువంటి పుట్టుక
ఎంతటి తీర్మానం
ఎంతటి వైరాగ్యం
ఎంతటి త్యాగం ఉండాలి
ఈ ప్రాయంలో
మనసారా నమస్కరించినా
ఈ మహా త్యాగాన్ని
తలచుకుంటుంటే
కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి
కన్నోళ్ళు చేసుకున్న భాగ్యం
తోడబుట్టిన సోదరి
అదృష్టవంతురాలు అని
ఎంత చెప్పినా
ఇక చనువుగా ఒరేయ్ గణేశా కన్నయ్యా అని పిలవలేరుగా
అన్నయ్యా ఎప్పుడొస్తావురా అని
అడగలేరుగా
మనసు బాధపడినా
సనాతన ధర్మానికి తదుపరి పీఠాధిపతి లభించడం
సంతోషమే.
కంచి మఠం నూతన పీఠాధిపతి శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఆయన 71వ పీఠాధిపతిగా నియమితులయ్యారు. ఫిబ్రవరి 28న జయేంద్ర సరస్వతి మరణం తర్వాత, విజయేంద్ర సరస్వతి పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టారు, అయితే 2025 ఏప్రిల్ 30న సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచి మఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు చేపట్టారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి