తెలంగాణ సారస్వత పరిషత్తు - బాలసాహిత్య ఉత్సవం
 పద్మభూషణ్ డాక్టర్ కే ఐ వరప్రసాదరెడ్డి ఆధ్వర్యంలోని శాంతా వసంతా ట్రస్టు సౌజన్యంతో మాతృమూర్తి కోడూరు శాంతమ్మ స్మారకార్థం ప్రతి సంవత్సరం హైదరాబాద్ నగరంలో బాలసాహిత్య సమ్మేళనం నిర్వహిస్తున్నాం.
ఈ సంవత్సరం మే 25 ఆదివారం ఆబిడ్స్, తిలక్ రోడ్డులోని సారస్వత పరిషత్తులో ఉన్న డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో ఈ ఉత్సవం జరుగుతుంది.
బాల సాహిత్య రంగంలో కృషి చేస్తున్న రచయితలు, రచయిత్రులు, ఉపాధ్యాయులు 9603727234 వాట్స్యాప్ నెంబర్లో ఈ నెల 10వ తేదీ లోగా ప్రతినిధులుగా పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.  ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు.


డాక్టర్ జె చెన్నయ్య 
ప్రధాన కార్యదర్శి
 తెలంగాణ సారస్వత పరిషత్తు, 
హైదరాబాద్.
కామెంట్‌లు