నెమ్మదిగా వెళ్తే గంట వేగంగా వెళితే రెండు గంటలు..:- --- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి- -9441561655
 ధర్వేశిపురం గ్రామంలో ధర్మయ్య అనే  బత్తాయి పండ్ల చిరు వ్యాపారి ఉండేవాడు.
 రోజుకొక ఊరు వెళ్లి తన పండ్లను తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్ముకునే వాడు. ఓసారి  ఎర్రబెల్లి గ్రామంలో జాతర జరుగుతుండగా అక్కడికి వెళ్లి తన పండ్లను  అమ్ముకోవాలనుకున్నాడు. . జాతరలో ఎక్కువ ధరకు  తొందరగా అమ్ముడుపోతాయని  ఆశ పడ్డాడు.
 
       ఒకరోజున పొద్దు పొద్దుగాలనే లేచి తోట దగ్గరికి వెళ్ళాడు. రెండు బస్తాల  నిండా పండ్లు నింపుకొని సైకిల్ కి కట్టుకొని  బయలుదేరాడు.కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఎప్పుడూ వెళ్ళని అతనికి ఎర్రబెల్లికి వెళ్లే  బాట సరిగ్గా తెలియక ఎంత దూరం ఉంటుందో..?  ఎంత సమయం పడుతుందోనని ఆందోళన పడ్డాడు. అటు ఇటు చూసాడు.  దూరంగా కంచెలో పశువుల కాపరి కనిపించాడు. అతనితో "ఎర్రబెల్లి వెళ్లడానికి ఎలా వెళ్లాలి?ఎంత సమయం పడుతుంది?" అని అడిగిండు. ఇట్లనే  ఇదే బాటలో వెళుతూ ఉండు. మూల మలుపులు ఎక్కువగా ఉంటాయి. నెమ్మదిగా వెళ్తే గంట పడుతుంది. వేగంగా వెళ్తే రెండు గంటల సమయం పడుతుంది అని పశువుల కాపరి అన్నాడు. ఆ మాటలు విన్న ధర్మయ్యకు నవ్వు వచ్చింది. పశువుల కాపరి ఒట్టి పిచ్చివాడు అనుకున్నడు. 
         జాతరకు జనం వచ్చే వేళ అయిందని ఆత్రుత పడుతూ సైకిల్ తొక్కుతూ వేగంగా వెళ్లసాగాడు. గతంలో ఎప్పుడు ఆ తోవ్వెంట వెళ్ళిని ధర్మయ్య చూడక ఓ మూల మలుపు కాడ  రాయి ఎక్కి కిందపడ్డాడు. సైకిల్ కున్న బత్తాయి బ్యాగులు చినిగి దూరంగా చెల్లాచెదురు పడ్డాయి. అమ్మయ్య అంటూ ధర్మయ్య లేచి మెల్లగా పండ్ల నన్నింటిని ఒక చోటకు చేర్చాడు. మళ్లీ  బస్తాలలో నింపుకొని  అతి కష్టం మీద  ఎర్రబెల్లి చేరుకున్నాడు. రెండు గంటలకు పైగా సమయం పట్టింది. అప్పుడు గానీ, పశువుల కాపరి అన్న మాటలు ధర్మయ్య కు అర్థం కాలేదు . 
       

కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం