'ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య': - ఈర్ల సమ్మయ్య
 

-ఊషన్నపల్లిలో బడిబాట సమావేశం నిర్వహణ
-పిల్లల్ని ప్రైవేట్ స్కూలుకు పంపించవద్దని తల్లిదండ్రులకు సూచన 

ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే సకల సౌకర్యాలతో కూడిన మెరుగైన విద్యను అందిస్తున్నారని
పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లిలోని ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య అన్నారు. సోమవారం ఆయన ఊషన్నపల్లిలోని హనుమాన్ దేవాలయం వద్ద పాఠశాల పిల్లల నమోదులో భాగంగా బడిబాట సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను గురించి తల్లిదండ్రులకు, గ్రామస్తులకు వివరించారు.  ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లలకు పోటీ తత్వం పెంపొందుతుందని, నిత్య జీవితంలో తలెత్తిన వివిధ సమస్యలను ఎలా అధిగమించాలో ప్రభుత్వ పాఠశాలల్లో నేర్పిస్తామన్నారు. సుమారుగా 90 శాతం ఉద్యోగాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికే వస్తున్నాయనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలన్నారు. డబ్బులు పెట్టికొనే విద్య మనకెందుకని, ప్రైవేటు విద్య పైన తల్లిదండ్రులు, ప్రజలు మోజు వీడాలన్నారు. పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించవద్దని ఆయన కోరారు. ఆరుగాలం చెమటోడ్చి కష్టపడి సంపాదించిన డబ్బును తల్లిదండ్రులు ఫీజుల పేరిట వృధా చేసుకోవద్దని సూచించారు. చక్కటి ఉచిత చదువుతోపాటు సకల సౌకర్యాలు కలిగిన మన ఊరిలోని ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే తమ పిల్లల్ని చేర్పించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. ఊషన్నపల్లిలోని ప్రభుత్వ పాఠశాల పిల్లల్ని అన్ని విషయాల్లో అద్భుతంగా తయారు చేస్తున్నామని, అందుకే పాఠశాలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా "బెస్ట్ స్కూల్ అవార్డు", జిల్లా విద్యాశాఖాధికారి చేతులమీదుగా "చాంపియన్ స్కూల్ అవార్డు" అందుకున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో యూకేజి నుంచి అయిదో తరగతి వరకు పిల్లలకు హిందీ భాషను ప్రవేశపెడుతున్నామని, కంప్యూటర్ ఆధారిత విద్యను అందిస్తున్నట్లు ఈర్ల సమ్మయ్య తెలిపారు. ఈ కార్యక్రమలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, మాజీ సర్పంచ్  కొనుకటి మల్లారెడ్డి, లక్కమారి కాపు కుల సంఘం అధ్యక్షులు ముస్కు మల్లారెడ్డి, కూసరాజు, మంద తిరుపతి, ఆవుల రామన్న, మంద మల్లారెడ్డి, మంద సతీష్, మంద చిన్న తిరుపతి, మేడిద రాజయ్య, మంద రాంరెడ్డి, కదురు ముత్తయ్య, ఆరే మల్లయ్య, మంద రాజిరెడ్డి, ఆవుల మల్లయ్య, ముస్కు రామన్న, గొడుగు ఓదెలు, మంద సుదర్శన్, మంద సంజీవరెడ్డి, అనుముల రాజి రెడ్డి, అంగన్వాడీ టీచర్ నాగమణి, పిల్లల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, యువతీ, యువకులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం