సునంద భాష్యం:- వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయాలు -891
దుశ్చికిత్స్య వ్రణ పీడితానాం వ్రణం శిశమయిషోః శస్త్ర గ్రహణమ్ న్యాయము
****
దుశ్చికిత్స్య అనగా చికిత్సలో తప్పు చేయడం, అనవసరమైన చికిత్స చేయడం. వ్రణము అనగా పుండు, గాయము. పీడితానాం అనగా పీడించబడినవారు, కష్టాల్లో ఉన్న వారు,బాధ పడుతున్న వారు. శిశువు అనగా బిడ్డ, చిన్న పాప లేదా బాబు. శిశు మయి అనగా పిల్లల తల్లి.శస్త్ర అనగా ఆయుధము, ఉపకరణము.గ్రహణమ్ అనగా పట్టుకొనుట,స్వీకరించుట,పలుకుట, ధరించుట,నేర్చుకొనుట,మనసున పట్టించుకొనుట,సంపాదించుట  అనే అర్థాలు ఉన్నాయి.
ఎన్ని మందులు వాడినా మానని పుండు బాధ పోగొట్టుటకు శస్త్రము చేయించినట్టు.శస్త్రము చేసే వైద్యుడు పుండును  కోసేటప్పుడు బాధను పోగొట్టడానికి గాని దయలేక పోవడం చేత కోయడు.అట్లే చెప్పిన మాట వినని కొడుకును శిక్షించడము వానిని  మంచి మార్గములో పెట్టడానికే గాని దయలేక కాదు అని అర్థము.
 నేటి సమాజంలోని తల్లిదండ్రులు అంతా తెలుసుకోవలసిన ఆచరించవలసిన న్యాయమిది. ఇందులో ఎంతో  గొప్ప సందేశం ఉంది. నేడు అతి గారాబం చేసే తల్లిదండ్రులు  ఇది చదివితే తప్పకుండా ఆలోచనలో పడతారు. తమ పెంపకాన్ని  పునశ్చరణ చేసుకుంటారు.
వైద్యుడు రోగి అనారోగ్యం పోగొట్టడానికి ఇచ్చే ఔషధాలు తీయగా మిఠాయిల్లా వుండవు. చేదు మాత్రలే.వాటినలా ఇవ్వడానికి  రోగి మీద వైద్యుడికి ఎలాంటి శత్రుత్వం, పగలు ప్రతీకారాలు ఉండవు కదా!  శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు ఆ యా భాగాలను కత్తితో కోయవలసి వస్తుంది.అంతేకాని  వైద్యుడికి రోగి మీద ఎలాంటి కోపం, ద్వేషం ఉండదు.
అలాగే మాట వినని పిల్లలను ఎక్కువగా తండ్రి గమనిస్తూ ఉంటాడు .వైద్యుడిలా వాళ్ళకు శిక్ష విధిస్తాడు . ఎందుకంటే పిల్లలు బాగుపడాలి అనే తపనే తప్ప మరొకటి కాదు.అందుకే కొందరు పిల్లలకు తండ్రంటే ఇష్టం ఉండదు,’’
 దీనికి చక్కని ఉదాహరణ భారవి కథ. భారవిని సమాజంలోని జనమంతా ఎంతో గొప్పవాడు  మెచ్చుకుంటే తండ్రి మాత్రం అస్సలు మెచ్చుకోడు దాంతో భారవికి  చాలా కోపమొస్తుంది. ఓ బండరాయితో తండ్రిని చంపాలని అటకెక్కి కూర్చున్న భారవి "తల్లితో అన్న మాటలు విని కిందికి దిగివచ్చి క్షమించమని తండ్రిని వేడుకుంటాడు.
అయితే తాను చేసిన తప్పుకు పశ్చాతాపంతో శిక్ష విధించమని వేడుకుంటాడు.
అప్పుడు తండ్రి  భారవి దంపతులను ఒక సంవత్సరం పాటు అత్తవారింట్లో ఉండమని చెబుతాడు. మొదట్లో ఇదేం శిక్షా?అనుకుంటాడు..భార్యతో కలిసి అత్తారింటికి వెళ్తాడు మొదటి రోజు ముత్యం చుట్టంలా అమితమైన మర్యాదలు, రెండో రోజు రత్నం చుట్టం అన్నట్లు  తగ్గిన మర్యాదలు. ఇక మూడో రోజు మురికి చుట్టం అన్నట్లు రోజు రోజుకూ మర్యాదలు మాయమై అవమానించే విధంగా అనేక పనులు చెబుతారు.అప్పుడు తెలుస్తుంది తండ్రి వేసిన శిక్ష ఏమిటో.. దీనిని బట్టే "శ్వసుర గృహం పరమ సుఖం త్రిరాత్రాత్ శునక సమానః  అనే నానుడి అనుభవం లోకి వస్తుంది.
 ఇలా చేయడం తన కొడుకును కష్టం పెట్టాలని కాదు కదా! కాబట్టి వైద్యుడు రోగికి వైద్యం చేసినా, తల్లిదండ్రులు లేదా గురువులు పిల్లల్ని క్రమశిక్షణ అనే పేరుతో శాసించినా, దండించినా వారి క్షేమం మరియు మంచి జీవితం గడిపేందుకే అని చెప్పేందుకే మన పెద్దవాళ్ళు ఈ  "దుశ్చికిత్స్య వ్రణ పీడితానాం వ్రణం శిశమయిషోః శస్త్ర గ్రహణమ్" న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 ఇదండీ ఈ న్యాయము లోని అంతరార్థము. పెరిగే మొక్కకు పాదు చేసి ఆధారం కడితేనే అటూ ఇటూ పోకుండా నిఠారుగా పెరుగుతుంది. అలాగే బాలలు కూడా. ఎలాంటి దుర్వ్యసనాలకు లోను కాకుండా మంచివాళ్ళుగా ఎదగాలనేది ఈ న్యాయము యొక్క ఆకాంక్ష. అలాగే మనది కూడా.నాతో ఏకీభవిస్తారు కదూ!

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం