మూగవాడి పట్టుదల: - దేవర శివతేజ-8వ, తరగతి-జిప ఉపా:బక్రిచెప్యాల


 ​ఒక ఊరిలో వరుణ్ అనే మూగవాడు ఉండేవాడు. అతనికి సరిగ్గా మాటలు రావు.చదువుకోవాలనే పట్టుదల మాత్రం చాలా బలంగా ఉండేది.ప్రతిరోజూ శ్రద్ధగా బడికి వెళ్లేవాడు. అయితే, తోటి స్నేహితులు అతన్ని చూసి ఎగతాళి చేస్తూ,వెక్కిరిస్తూ ఉండేవారు. 
వరుణ్ వారి మాటలను పట్టించుకోకుండా తన చదువుపైనే శ్రద్ధ పెట్టేవాడు. కానీ,అతని స్నేహితులు మాత్రం చదువుకోకుండా జల్సాగా తిరిగేవారు.
​వార్షిక పరీక్షలు వచ్చాయి. వరుణ్ రాత్రింబవళ్లు కష్టపడి చదివి క్లాసులో ఫస్ట్ వచ్చాడు.చదవని స్నేహితులు వెనుకబడిపోయారు.దీంతో వరుణ్‌పై అసూయ పెంచుకున్నారు.ఒకరోజు అతన్ని బడి వెనుకకు తీసుకెళ్లి గట్టిగా కొట్టారు."ఈ విషయం ఎవరికైనా చెప్తే మళ్లీ కొడతాం"అని బెదిరించారు.
​వరుణ్ గాయాలతో ఇంటికి వెళ్లాడు.తల్లిదండ్రులు కంగారుపడి ఆసుపత్రికి తీసుకెళ్లారు.ఎంత అడిగినా వరుణ్ ఎవరి పేరూ చెప్పలేదు.
​మరుసటి రోజు వరుణ్ దెబ్బలతోనే బడికి వచ్చాడు. తెలుగు సార్ అది చూసి, "ఏమైంది వరుణ్?"అని అడిగారు.అప్పుడు వరుణ్ నెమ్మదిగా తన స్నేహితుల వైపు చేయి చూపించాడు.
​అది చూసి తెలుగు సార్ ఆ పిల్లలను పిలిచి మందలిస్తూ ఇలా చెప్పారు.
​బడికి వచ్చే వాళ్లందరూ సమానమే.ఇక్కడ ఒకరు ఎక్కువ,ఒకరు తక్కువ కాదు. 'కలిసి ఉంటే కలదు సుఖం'. అందరూ కలిసిమెలిసి ఉంటేనే జీవితంలో బాగుపడతారు."
​సార్ మాటలతో ఆ పిల్లలు తమ తప్పు తెలుసుకుని, వరుణ్‌కు క్షమాపణలు చెప్పారు.
​నీతి: పట్టుదల ఉంటే ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చు. తోటివారితో కలిసిమెలిసి ఉండటమే నిజమైన సంస్కారం.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
మొల్ల విరులు;- .బి. అరుణ- పి జి టి - తెలుగు
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం