ఒక ఊరిలో వరుణ్ అనే మూగవాడు ఉండేవాడు. అతనికి సరిగ్గా మాటలు రావు.చదువుకోవాలనే పట్టుదల మాత్రం చాలా బలంగా ఉండేది.ప్రతిరోజూ శ్రద్ధగా బడికి వెళ్లేవాడు. అయితే, తోటి స్నేహితులు అతన్ని చూసి ఎగతాళి చేస్తూ,వెక్కిరిస్తూ ఉండేవారు.
వరుణ్ వారి మాటలను పట్టించుకోకుండా తన చదువుపైనే శ్రద్ధ పెట్టేవాడు. కానీ,అతని స్నేహితులు మాత్రం చదువుకోకుండా జల్సాగా తిరిగేవారు.
వార్షిక పరీక్షలు వచ్చాయి. వరుణ్ రాత్రింబవళ్లు కష్టపడి చదివి క్లాసులో ఫస్ట్ వచ్చాడు.చదవని స్నేహితులు వెనుకబడిపోయారు.దీంతో వరుణ్పై అసూయ పెంచుకున్నారు.ఒకరోజు అతన్ని బడి వెనుకకు తీసుకెళ్లి గట్టిగా కొట్టారు."ఈ విషయం ఎవరికైనా చెప్తే మళ్లీ కొడతాం"అని బెదిరించారు.
వరుణ్ గాయాలతో ఇంటికి వెళ్లాడు.తల్లిదండ్రులు కంగారుపడి ఆసుపత్రికి తీసుకెళ్లారు.ఎంత అడిగినా వరుణ్ ఎవరి పేరూ చెప్పలేదు.
మరుసటి రోజు వరుణ్ దెబ్బలతోనే బడికి వచ్చాడు. తెలుగు సార్ అది చూసి, "ఏమైంది వరుణ్?"అని అడిగారు.అప్పుడు వరుణ్ నెమ్మదిగా తన స్నేహితుల వైపు చేయి చూపించాడు.
అది చూసి తెలుగు సార్ ఆ పిల్లలను పిలిచి మందలిస్తూ ఇలా చెప్పారు.
బడికి వచ్చే వాళ్లందరూ సమానమే.ఇక్కడ ఒకరు ఎక్కువ,ఒకరు తక్కువ కాదు. 'కలిసి ఉంటే కలదు సుఖం'. అందరూ కలిసిమెలిసి ఉంటేనే జీవితంలో బాగుపడతారు."
సార్ మాటలతో ఆ పిల్లలు తమ తప్పు తెలుసుకుని, వరుణ్కు క్షమాపణలు చెప్పారు.
నీతి: పట్టుదల ఉంటే ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చు. తోటివారితో కలిసిమెలిసి ఉండటమే నిజమైన సంస్కారం.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి