భిక్ష - దీక్ష (కథ) --- నారంశెట్టి ఉమామహేశ్వరరావు--సిద్ధార్థుడు రాజ్యాన్ని, సంసారాన్ని విడిచిపెట్టి బుద్ధుడై ధర్మప్రచారం ప్రారంభించాక పటిష్టమైన ఆశ్రమ వ్యవస్థ ఏర్పడింది.బుద్ధుడి బోధనలను ఇష్టపడి అనేక మంది దీక్ష స్వీకరించి శిష్యులై బుద్ధుడి బోధనలను ధర్మప్రచారం చేయడం మొదలుపెట్టారు. ప్రతిరోజూ కొందరు కొత్తవారు వచ్చి బుద్ధుడి దగ్గర దీక్ష పొందేవారు. అర్హులైన వారికి మాత్రమే దీక్ష ప్రసాదించేవాడు తప్ప అనర్హులను చేరనిచ్చేవాడు కాదు బుద్ధుడు.ఒకసారి ఒక సంపన్న యువతి బుద్ధుని దర్శించుకుని దీక్ష ఇమ్మని , శిష్యురాలుగా స్వీకరించమని వేడుకుంది. ఆమెను పరిశీలించి ‘కొన్ని రోజులు తరువాత దీక్ష చేస్తాను. నీలో ఉన్న దుర్గుణాలను ముందు దూరం చేసుకో” అని పంపించేశాడు బుద్ధుడు.సంపన్న యువతి నిరాశగా వెనుదిరిగింది. బుద్ధుడి మీద కోపం పెంచుకుని అదను కోసం చూసింది. కాలం గడుస్తోంది. ఒక మాసం తరువాత బుద్ధుడు భిక్ష కోసం వీధుల వెంట తిరుగుతూ సంపన్న యువతి ఇంటి ముందు నిలబడి “భిక్షాoదేహి” అని యాచించాడు.సంపన్న యువతి మేడ మీద నుండి బుద్ధుణ్ణి చూసి “నా పాదాల దగ్గరకే వచ్చాడు కదా భిక్ష కోసం “ అని గర్వంగా అనుకుంది.భిక్ష తీసుకుని బుద్ధుని ముందుకు వెళ్ళింది. బుద్ధుని వైపు, చేతిలోని భిక్షాపాత్ర వైపు ఏహ్యభావంతో చూసి “ఏమయ్యా సన్యాసి ! భిక్షా పాత్ర ఇంత మట్టి గొట్టుకుని ఉంటే భిక్ష ఎట్లా వేయమంటావు ?” అని ఈసడించుకుంది. బుద్ధుడు నవ్వుతూ “భిక్ష సంగతి తరువాత చూద్దాం. మనసులో ఇంత మాలిన్యం ఉంటే దీక్ష ఎట్లా ఇచ్చేది” అన్నాడు.సంపన్న యువతికి తల తిరిగి పోయింది. ఒక్కసారి ఆమెకు అంటిన గర్వపు పొరలు తొలగిపోయాయి. బుద్ధుడు తనని పరీక్షించడానికే భిక్ష కోసం తన ఇంటి ముందు నిలబడ్డాడని అర్ధమైంది. వెంటనే ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంది.దీక్ష తీసుకోవాలనుకునేవారు కోపం, ద్వేషం, అహంకారం , దురాశ మొదలగు చెడుగుణాలను వదిలించుకోవాలని తెలుసుకుంది.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం