పత్రికల ముచ్చట్లు (వీరాజీ గారితో నేను)--డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,--హనంకొండ .9866252002--8886991785

పుస్తకాలు ,పత్రికలు చదవటమే గాని ,పత్రికలలో 
రాయాలనే ,కోరిక ,అవకాశం ,బి.డి.ఎస్ ..లో చేరే 
వరకు రాలేదు .
అన్నయ్య కె .కె .మీనన్ ,తమ ఆఫీసులోని ,సాహిత్య 
సంస్థ ,' రంజని ' నుండి కథల పుస్తకాలు /నవలలు 
ఇంటికి తెచ్చేవారు .వాటిని వెనువెంటనే చదివేసేవాడిని .వదిన గారు ,తన ఆఫీస్ బుక్ క్లబ్ 
నుండి ,బోలెడు పత్రికలు తెచ్చేవారు .అవిధంగా 
అతి చిన్నవయస్సులోనే ,పత్రికలు చదవడం అల _
వాటు అయింది.
ఆ ..రోజుల్లో నేను చదివిన /చూసిన పత్రికలలో ..
ఆంద్ర పత్రిక 
ఆంద్ర ప్రభ 
ఆంద్ర జ్యోతి 
ఆంద్రప్రదేశ్ 
యోజన ,
యువ 
జ్యోతి _మాసపత్రిక 
జయశ్రీ _మాసపత్రిక ......మొదలైనవి.
ఈనాడు దినపత్రిక మొదలయ్యేనాటికి ,నేను బి.డి.
ఎస్ .,లో చేరాను .అప్పట్లో ఆదివారం ప్రత్యేక సంచిక 
పుస్తక రూపంలో ఉండేది కాదు .నాలుగు పేజీల 
ప్రత్యేక అనుబంధం ఉండేది.దానిలో ,సాధారణ 
విజ్ఞాన శాస్త్ర మినీ వ్యాసాలు రాస్తూండేవాడిని.
అప్పుడే ,డా.ఎ .ఎస్ .నారాయణ గారు దంత వైద్య 
విజ్ఞానం ,డా.జి .సమరం గారు ,సెక్స్ సైన్స్ _వ్యాసాలు ,రాస్తుండేవారు.నేను ఒకసారి "కట్టడు ..
పళ్లు అవసరమా ?" అనే చిరు వ్యాసం రాశాను.
అది చదివిన మా అసిస్టెంట్ ప్రొఫెసరు ఒకాయన (ఆయన ఇప్పుడు మనమధ్య లేనందువల్ల వారి 
పేరు ఇక్కడ ప్రస్తావించడం లేదు )" ఇది నువ్వే రాశావా ?"అన్నారు .అప్పుడు ఆయన నన్ను 
ప్రశంసించారో ,విమర్శిస్తూ వెటకారంగా మాట్లాడారో 
నాకు అర్థం కాలేదు గాని ,నాలో ఆయన మాటలు 
ఒక ఉత్ప్రేరకంగా పనిచేసి ,ఇంకా రాయాలనే కసి 
మాత్రం పెరిగింది.అంతే ...మరోవ్యాసం రాసి ఆంద్ర 
పత్రిక ,అదివారం అనుబంధానికి పంపాను.అదే ..
అదివారం,ఆ ..వ్యాసం పత్రికలో ప్రచురింపబడింది .
అప్పుడు ఆంద్ర పత్రిక సంపాదకులు ,శ్రీ వీరాజి గారు 
ఆయనతో నాకు పరిచయం లేదు .అలాగే నేను 
ఎవరో ..ఆయన ఎరుగరు.నేను రాసి న ,ప్రతి వ్యాసము,కవిత ,అలా అచ్చయి పోతుండేవి.అలా 
ఒక పదివ్యాసాలు వచ్చాక ,వీరాజి గారిని చూడ 
డానికి,విజయవాడ ఆంద్ర పత్రిక ఆఫీసుకి వెళ్లి నన్ను 
నేను పరిచయం చేసుకున్నాను.నన్ను చూసిన 
ఆయన "..మీరా ..ఎవరో పెద్దాయన అనుకున్నాను "
అని నవ్వి ,కూర్చోబెట్టి ఎంతో అత్మీయంగా మాట్లాడారు .తరువాత ఎప్పుడయినా మా అత్త ..
గారి ఇంటికి విజయవాడ వెళ్ళినప్పుడు,తప్పకుండా 
వీరాజి గారిని ,సత్యన్నారాయణ పురంలో ,వారి 
స్వగృహంలో ,కలుస్తుండేవాడిని.
ఆయన సంపాద కత్వం లో ,వెలువడిన ,ఆంధ్రపత్రిక 
దినపత్రిక,వార పత్రిక ,మహిళలకోసం ,కలువబాల ,
పిల్లల పత్రిక ,బాలరంజని ,పత్రికలలో వ్యాసాలు ,
కవితలు (ఒక కార్టూను కూడా !)రాసాను.నా జీవితంలో ,మరచిపోలేని /మరచిపోకూడని ,
మహానుభావులలో ' వీరాజి 'గారు ఒకరు !!
ఆయన ఇప్పుడు హైదరాబాద్ లో ,పిల్లలతో ,
విశ్రాంతి జీవితం గడుపుతున్నారు.


   


కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం