ఈ రోజు క్రిస్మస్ కదా.! అంతే కాదు వైకుంఠ ఏకాదశి, గీత జయంతి. ఈ రోజే, శుభ శుక్రవారం, అన్ని మతాల వారికీ పండుగ రోజే కదూ. మరి ఈ సందర్బంగా అందరికి శుభాకాంక్షలు.ఇక్కడ ఒక విశేషం చెప్పు కుందాం, ప్రపంచమంతా క్రిస్మస్ శీతాకాలం లో జరుపుకుంటారు , కానీ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లలో ఇది వేసవి లో వస్తుంది. అయినా భారత దేశంలో లో ఉన్నట్టు , చర్చీలలో ఏమీ హంగామా ఉండదు. ఎవరి ఇంటి వద్ద వారు జరుపుకుంటారు.దుకాణాలు, కార్యాలయాలు అన్నీ మూసి ఉంచుతారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి.సికింద్రాబాద్ లో సెయింట్ మేరీ , సెయింట్ జార్జ్ చర్చ్ లు ఎంతో సందడిగా ఉంటాయి కదూ. కానీ ఇక్కడ ఆ అలజడే కనిపించదు, స్నేహితులు, బంధువులతో ఇంటివద్దే విందులు చేసుకుంటారు.ఈ మధ్య డే కేర్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో క్రిస్మస్ శాంతా వద్ద ఆద్య మంచి కథల పుస్తకం బహుమతిగా అందుకుంది.వేసవి సెలవులు కదా. ఆద్య , ఆరియా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించు కున్నారు.. అవేంటో రేపు తెలుసుకుందాం.(మరిన్ని ముచ్చట్లతో రేపు కలుద్దాం )
'ఆ ' ఇద్దరు : - టి. వేదాంత సూరి
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి