విశ్వాసం కథ : -- కందర్ప మూర్తి, హైదరాబాదు

 షిర్దీ సాయిబాబా చుట్టు గ్రామాల్లో బిక్షాటన చేసుకుంటూంటారు.ఒక రోజు పొరుగు గ్రామానికి నడిచి వెళుతూంటే
ఒక ఊరి పొలిమేరలో ఆడ శునకం కూనల్ని ప్రసవిస్తోంది. రెండు కూనలు సక్రమంగా ప్రసవం జరగ్గా మూడవ కూన గర్భంలో అడ్డు
తిరిగి ప్రసవం జరగక యాతన అనుభవిస్తోంది. అది గమనించిన
బాబా దగ్గరకు రాగానే భయపడి కరవడానికి ప్రయత్నిస్తోంది .
  బాబా తన భుజానికున్న జోలి లోంచి ఒక రొట్టె ముక్కని దాని నోటి
ముందు ఉంచి మెల్లగా దగ్గరకు వెళ్ళి ఒక చేత్తో దాని మూతిని బంధించి
రెండవ చేత్తో శునక మర్మాంగంలో చేతిని ఉంచి అడ్డు తిరిగిన కూనని
మెల్లగా బయటకు లాగి తన తల మీదున్న అంగవస్త్రాన్ని అడ్డుగా ఉంచి
రక్త స్రావాన్ని నిలువరించ గలిగాడు. కూనల్ని తల్లి పొదుగుల వద్ద   చేర్చి
 పాలను  తాగేలా చేసారు. కొద్ది సమయం తర్వాత రక్త స్రావం నిలిచి పోగా  అంగవస్త్రాన్ని తొలగించి చేతుల్ని మట్టితో శుభ్రం చేసుకున్నారు.
శునకం కూనలు పాలు కుడుస్తూంటే మాతృ మమకారంతో తన
బాధని మరిచి పోయింది. బాబా తన దారిన ముందుకు సాగిపోయారు.
     మరికొద్ది రోజుల తర్వాత సాయిబాబా ఆ దారంట వెల్తూంటే
ఎక్కడి నుంచో తల్లి శునకం తన కూనలతో  పరుగున వచ్చి  బాబా
కాళ్లని నాకడం మొదలెట్టింది. బాబా దాని విశ్వాసానికి మురిసిపోయి
భుజానికున్న  జోలెనుంచి రొట్టె ముక్కలు తీసి దాని నోటి కందించారు.
                   *                    *                    *
                   
                
కామెంట్‌లు