చదువుతున్నాడు.అతనుచాలామంచివాఢు.సహకార గుణంకలవాడు. సేవాభావం కలవాడు .కష్టపడి చదివేవాడు.ఒకరోజు ఆ పాఠశాలముందు ఒక వృద్దుడు నీరసంగా పడిఉండటం చూశాడు.విద్యార్థులు ఎవరూపట్టించుకోలేదు.నితిన్ వృద్దుడి దగ్గరకెళ్ళిపలకరించాడుఅతను అనాథ అని ఆకలితో ఉన్నాడని తెలుసుకున్నాడు.తన బ్యాగులో ఉన్నరెెండు అరటిపండ్లు, ఒక జామపండు తెచ్చి ఇచ్చాడు.తిన్నాక నీళ్ళు ఇచ్చాడు.తర్వాతఆ వృద్దుడు నితిన్ ను సేవాగుణానికిసంబంధించిన కొన్ని ప్రశ్నలడిగాడు.ఆకలితో ఉన్నవారికి వృద్దులకు వికలాంగులకు చేతనైన సాయం చేయాలనిమానవత్వం కలిగి ఉండాలని నితిన్ చెప్పినసమాధానాలు విని అభినందించాడు.తర్వాత మరునాడువృద్దుడు పాఠశాలలోకి వచ్చా డు.తెల్లటికొత్తదుస్తుల్లోమెరిసిపోతున్నాడుప్రధానోపాధ్యాయుడి తో మాట్లాడి. నితిన్తల్లిదండ్రులను పిలిపించమన్నాడు.ప్రధానోపాధ్యాయుడు నితిన్ ను ఇంటికెళ్ళి అమ్మ.నాన్నలను పిల్చుకురమ్మన్నాడు.వాళ్ళు వచ్చారువృద్దుడు వారికి జరిగిన విషయం చెప్పి "నేనుకోటీశ్వరుడిని. నాకు పిల్లలులేరు.నాడబ్బునుసేవాగుణం కల్గిన పేదపిల్లల కోసం ఉపయోగించాలనుకుంటున్నాను.అలాంటివారిని గుర్తించటం కోసమే తిరుగుతూ ప రీక్షించి దయాగుణం గలవారి చదువుకు సాయం చేస్తూ వస్తున్నాను.మీఅబ్బాయి పేరుతో బ్యాంక్లో ఐదులక్షలు జమచేస్తాను.ఆ డబ్బు చదువుకోసం ఉపయోగించండి.ఇలాంటి పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తే, సమాజానికి సేవలందిస్తారు"అనిచెప్పి అభినందించాడు.ఆయన నితిన్ పేరుతో డబ్బు బ్యాంక్ లో వేశాడు.నితీన్ ఉన్నత చదువులు చదివి,ఉన్నతపదవిని పొంది, పేదలకు, అనాధలకు సేవలందించాడు.(డి.కె.చదువులబాబు సంపాదకత్వంలో విద్యార్థులు వ్రాసిన కొత్తపేటకలాలు కథాసంకలనంలోని కథ)
సేవాఫలం: -డి. సమీరభాను.8వతరగతి.కొత్తపేట.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి