*సన్నుత కార్యదక్షుఁడొక | చాయ నిజప్రభ యప్రకాశమై**యున్నపుడైన లోకులకు | నొండొక మేలోనరించు సత్వ సం**పన్నుఁడు భీముఁ డా ద్విజుల | ప్రాణము కావఁడె యేక చక్రమం**దెన్నికగా బకాసురుని | నేపున రూపడఁగించి భాస్కరా!*తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..చక్కని కార్య దక్షత, ఎంతటి వానిని అయినా ఎదిరించి నిలబడే ధైర్యము ఉన్న వ్యక్తి, ఎప్పుడైన విధి ఆడిన ఆట వలన తన గొప్పతనం, ఏమీ చేయలేని స్థితి అనే మబ్బు చేత కప్పబడి ఉన్నా కూడా అవసరం, అవకాశం వచ్చినప్పుడు ఎదుటివారికి సహాయం చేస్తాడు. ఎలాగంటే, పాండు కుమారులు ఏక చక్ర పురంలో బిచ్చమెత్తుకుంటూ జీవించే డప్పుడు కూడా భీమసేనుడు, బకాసురుని చంపి ఏకచక్రపురములోని బ్రాహ్మణులను అందరినీ రక్షించాడు కదా. .....అని భాస్కర శతకకారుని వాక్కు.*ఏ వ్యక్తి సమర్ధతనైనా, ఆ మనిషి వున్న పరిస్థతులను బట్టి, ఒక అంచనాకు రావడం కుదరదు. అలా అంచనా వేయడం మంచిది కాదు* అని భావం......ఓం నమో వేంకటేశాయNagarajakumar.mvss
భాస్కర శతకము - పద్యం (౯౭ - 97)
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి